07/09/2016

దువ్వాడ వెళ్లే హీరోయిన్ తేలలేదింకా

సరైనోడు అంటూ తన రేంజ్ కి సరైన సక్సెస్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త మూవీ మొదలుపెట్టేస్తున్నాడు. డైరెక్టర్ పేరు అనౌన్స్ చేయడం ఆలస్యం అయింది కానీ.. అక్కడి నుంచి వరుసగా అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి దర్శకుడు హరీష్ శంకర్ చిన్నపాటి షాక్ నే ఇచ్చినా.. ఓ విషయం దగ్గర మాత్రం ఈ స్పీడ్ ఆగిపోయింది. 

బన్నీ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరా అన్న పాయింట్ మాత్రం తేలడం లేదు. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి కూడా. మొదట టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అని.. ఆ తర్వాత కృష్ణగాడి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాడాని ఓకే చేశారని వార్తలొచ్చాయి. అయితే.. హీరోయిన్ ని మాత్రం దువ్వాడ జగన్నాథం యూనిట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ హీరోయిన్ తో హరీష్ శంకర్ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. తను అడిగినన్ని డేట్స్ ఇచ్చే హీరోయిన్ కావాలన్నది దర్శకుడి కండిషన్ అనుకుంటున్నారు. 

దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. దువ్వాడ జగన్నాథం కోసం భారీ బడ్జెట్ నే కేటాయించారని అంటున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్ ఈ మూవీకి పని చేయనుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే దువ్వాడ జగన్నాథం.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయాని కల్లా హీరోయిన్ ని ఫైనలైజ్ చేస్తారట. 

No comments:

Post a Comment