12/09/2016

పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారుగా

మేము ఇస్తున్నది తిరుమల శ్రీవారి లడ్డు అని కానీ షుగర్ ఉన్నవాళ్ళ కు అది పాచిపోయిన లడ్డు లాగా అనిపిస్తుందని ,అనవసర విమర్శలు కేంద్రంపై చేయొద్దని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారు బిజెపి నేతలు , కేంద్ర మంత్రులు . ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ లు అవసరం లేదని హోదా ఇవ్వాల్సిందే అంటూ పవన్ కేంద్ర ప్రభుత్వం పై అలాగే వెంకయ్య నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే . దాంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసారు బిజెపి నేతలు . కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా పవన్ ని అదుపులో ఉండమని హెచ్చరించాడు . ఇక ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిజెపి నాయకులు అయితే పవన్ పై ఒంటి కాలు మీద లేస్తున్నారు , విమర్శలకు దిగుతున్నారు . పవన్ మాత్రం వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం లేదు ప్రస్తుతానికి . మరి ఎలా ? ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి . 

No comments:

Post a Comment