07/09/2016

'ధృవ' డిసెంబర్ లోకి దూకింది అందుకే

ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ ఏంటంటే.. అసలు అక్టోబర్ 7న రావల్సిన ''ధృవ'' సినిమా డిసెంబర్ లోకి ఎందుకు దూసుకెళ్లింది? అసలు ఇప్పటివరకు గీతా ఆర్ట్స్ ఇలా పోస్టుపోన్ రూమర్ల మీద ఎందుకు స్పందించలేదు? రామ్ చరణ్ కూడా దసరాకే పండగ అన్నాడు కదా.. సైలెంట్ అయిపోయాడేంటి? ఇలాంటి ప్రశ్నలే మెగాభిమానుల మదిని తొలిచేస్తున్నాయి. 

నిజానికి చాలా టైట్ షెడ్యూల్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు దసరాకు ''ధృవ'' ట్రీట్ అందించేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ హడావుడి పడిపోయి రిలీజ్ చేయడానికి.. రామ్ చరణ్ సినిమాకు సీజన్ తో పనిలేదు. అలాగే దసరాకు ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా కాంపిటీషన్ ఉంది. పైగా పెద్ద సినిమాల్లో కేవలం జనతా గ్యారేజ్ ఒక్కటే అప్పటికి ధియేటర్లలో ఉంటుంది. అప్పటికే ఈ గ్యారేజ్ విడుదలై చాలా రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి.. ఓ నాలుగైదు సినిమాల కోసం జనం ఎదురుచూస్తుంటారు. కాని ఇలాంటి కాంపిటీషన్లో ఏ స్టార్ హీరో సినిమాను దించినా కూడా.. 50 కోట్లు వసూలు చేయడం గగనం అయిపోతోంది. అందుకే సోలోగా వచ్చి ఒక 80 కోట్ల షేర్ పట్టేయాలని.. సినిమాను డిసెంబర్ మొదటివారానికి చరణ్ అండ్ కో పోస్టుపోన్ చేయించారట. 

ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పాటలను షూట్ చేసేశారు. అలాగే అరవింద్ స్వామికి సంబంధించి కీలకమైన సన్నివేశాలు కూడా పూర్తయ్యాయ్. ప్రస్తుతం హైదరాబాద్ లో టాకీ పార్టును తీస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. త్వరగా ఇవన్నీ పూర్తి చేసుకుని.. వీలైనంత ప్రీ-రిలీజ్ బజ్ సృష్టించి.. అప్పుడు సినిమాను దించేస్తారట గీతా ఆర్ట్స్ వారు. అది సంగతి. 

No comments:

Post a Comment