12/09/2016

బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో చెర్రీ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ చాలానే ఉంటాయి. ఖైదీ తర్వాత అన్నింటిలోకి స్పెషల్ గా చెప్పుకునే మూవీస్ లో జగదేకవీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది. చిరంజీవి రేంజ్ ని కాంపిటీటివ్ హీరోలు అందుకోలేనంత హైట్స్ కి తీసుకెళ్లిన మూవీ ఇది. నిర్మాత అశ్వనీదత్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తీశాడు. అంతకు మించి లాభాలను కూడా అందుకున్నాడు. 

ఈ జగదేకవీరుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అశ్వనీదత్. అయితే.. ఇందులో రామ్ చరణ్ మాత్రమే నటించాలన్నది ఆయన కోరిక. ఇప్పటికే పలుమార్లు చరణ్ తో మాట్లాడ్డమే కాదు.. చాలామంది దర్శకులు.. స్టోరీ రైటర్లతో మాట్లాడేశాడు కూడా. ఇటు స్టోరీ దొరకలేదు.. అటు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ.. ఈయన ఇప్పటికే 'జగదేకవీరుడు' టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించేశాడు. ఇప్పటికీ ఈ సీక్వెల్ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

అయితే.. అటు స్టోరీ ఫైనల్ కాకుండా.. ఇటు డైరెక్టర్ ఎవరో తేలకుండా.. తండ్రి నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటించేందుకు రామ్ చరణ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నదే అసలు పాయింట్. ముందు ఇవి ఫైనల్ అయితే.. అప్పుడు చెర్రీ కూడా ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేయచ్చు లేకపోతే ఇలా మాటల దగ్గరే ఏళ్లు గడిచిపోతాయ్.  

No comments:

Post a Comment