16/09/2016

మోహన్ బాబు కోసం మెగాస్టార్ సెలవ్

మెగాస్టార్ చిరంజీవి- మోహన్ బాబుల మధ్య వైరం ఉందో లేదో చెప్పడం కష్టం కానీ.. వీరిద్దరి మధ్య పెద్దగా సఖ్యత అయితే లేదన్న మాట వాస్తవం. మాటకు మాట అన్నట్లుగా మాట్లాడుకునే సందర్భాలు పబ్లిక్ గానే కనిపిస్తూనే ఉంటాయి. నవ్వుతూనే మాటల తూటాలు విసురుకునే వీళ్లని టామ్ అండ్ జెర్రీ టైపులో అభివర్ణిస్తూ ఉంటారు సినీ జనాలు. ఇదంతా గతం అనిపిస్తోందిపుడు. మెల్లగా ఇద్దరూ దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎంబీ40 పేరుతో మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 17న వైజాగ్ లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఖైదీ నెంబర్ 150 మూవీని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్న చిరు.. తన పాత మిత్రుడు కం ఎక్సెట్రా అయిన మోహన్ బాబు కోసం బ్రేక్ ఇచ్చేశారు. విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి నిర్వహిస్తున్న సత్కారం కార్యక్రమానికి చిరు హాజరు కానుండడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా చిరు- మోహన్ బాబు కలవడానికి ప్రధాన కారణం దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు సఖ్యత కుదర్చడమే అంటున్నారు.

మరోవైపు మోహన్ బాబు సన్మాన కార్యక్రమానికి చిరు-దాసరితో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు అనేకం హాజరు కానున్నారు. 

No comments:

Post a Comment