09/09/2016

సభ ఎఫెక్ట్: ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ కబురు

అన్నను కాదని - వదినను కాదని - అమ్మను కాదని - కుటుంబ సభ్యులను కాదని ఎవరి గెలుపుకోసమైతే భుజంకాసారని చెబుతున్నారో.. అదే పార్టీలను కాకినాడ సభ సాక్షిగా కడిగేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మీ పై గౌరవం ఉంది - అభిమానం ఉంది అంటూనే.. వెంకయ్య నాయుడిపై నిప్పులు కురిపించారు. "మీ గెలుపుకోసం ప్రాణాలకు సైతం తెగించి మద్దతు పలికాను.. అలాంటి మీతోనే పోరాడాల్సిన పరిస్థితిని కలిపించొద్దు" అని కాకినాడ సభలో వెంకయ్య నాయుడిని - బీజేపీ పెద్దలను ఉద్దేశించి పవన్ హెచ్చరించారు. ఈ క్రమంలో పవన్ సభ పూర్తయిన కాసేపటికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి కబురు అందిందని సమాచారం.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తదనంతర పరిణామాలు - కాకినాడ సభలో పవన్ వ్యాఖ్యలపై చర్చించేందుకో ఏమో కానీ.. ఏపీ బీజేపీకి చెందిన మంత్రులు - శాసనసభాపక్ష నేతలు ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ అధిష్ఠానం కబురు పంపించింది. దీంతో మంత్రులు మాణిక్యాల రావు - కామినేని శ్రీనివాసరావు - విష్ణుకుమార్ రాజు లతో పాటు మిగిలిన కొంతమంది నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర మంత్రులు - భాజపా అధ్యక్షుడు అమిత్ షా - ఇతర ప్రముఖులతో జరగబోయే సమావేశంలో ఏపీ బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

No comments:

Post a Comment