11/09/2016

పవన్ కళ్యాణ్ ని విమర్శించిన కేటిఆర్

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తొలినాళ్ళ లో 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పిన మాటలను తప్పుబట్టారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . ఏ గూటి పక్షలు ఆ గూటికే చేరుతాయన్న చందంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యిందని , పవన్ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలకు అభ్యంతరకరమని ఓ టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు కేటిఆర్ . అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలని ఏ నాయకుడు కూడా పోరాటం చేయడం లేదని , వాల్లెవరికి చిత్తశుద్ది కూడా లేదని ఇప్పటివరకు ఎపి కి ఏమైనా వచ్చాయంటే అది కేవలం మా వల్లే అంటూ పెద్ద బాంబు పేల్చాడు కేటిఆర్ . తెలంగాణ రాష్ట్రము ఏర్పడటం వల్ల పలు సంస్థలు ఎపికి వచ్చాయని అంటున్నాడు కేటిఆర్.

No comments:

Post a Comment