07/09/2016

డిసెంబర్ 12 నుంచి మెగాస్టార్ వస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని తూకం వేయడం అంచనా వేయడం సాధ్యం కాదు. వెండితర రారాజుగా వెలిగిపోయిన ఆయన.. గత 9 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటూ.. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అంటూ రాబోతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. దీని కంటే ముందు మరో పెద్ద సంచలనం నమోదు కానుంది. 

మెగాస్టార్ బుల్లితెరపైకి కూడా వచ్చేయనున్నారట. ఓ గేమ్ షోకు హోస్ట్ గా ఆన వ్యవహరించనుండగా.. ఈ కార్యక్రమానికి ఇప్పటికే కోట్లకొద్దీ అభిమానులున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నాలుగో సీజన్ కి మెగాస్టార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.  మాటీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమం. ఇప్పటికే 3 సీజన్ల పాటు సాగింది. అనుకన్న స్థాయి కంటే చాలా ఎక్కుగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. 

గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం సూపర్ హిట్ కాగా.. ఈ సారి మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు మాటీవీ ఏర్పాట్లు చేసుకుంటోంది. డిసెంబర్ 12 నుంచి మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానుంది. ఖైదీ నెంబర్ 150 కంటే ముందే.. మెగాస్టార్ సంబరాలు ప్రారంభమైపోవుతాయన్న మాట. 

No comments:

Post a Comment