09/09/2016

చిరంజీవి మరో స్థాయికి తీసుకెళ్తాడు-నాగ్

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయి. ఇంతకుముందెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్ సాధించింది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అంత పెద్ద సక్సెస్ కావడంలో నాగార్జునది కీలక పాత్ర. ఐతే మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగ్.. అనూహ్యంగా నాలుగో సీజన్ కు దూరమైపోయాడు. ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. ఐతే ఇది ప్రోగ్రాం మేలు కోసం తీసుకున్న నిర్ణయమే అని.. చిరంజీవి ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేశాడు నాగ్.

‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అది నా జీవితంలో ఓ కీలక మలుపు. ఇన్నేళ్లలో సినిమాల ద్వారా ఎంత ఆదరణ సంపాదించుకున్నానో.. అంత ఆదరణ ఈ ప్రోగ్రాంతో దక్కింది. ఐతే సమయానికి తగ్గట్లు మనం ముందుకు వెళ్లిపోవాలి. షో సూపర్ సక్సెస్ అయినపుడే నిష్క్రమించడం మంచిదే. చిరంజీవి గారు నా స్థానంలోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారు’’ అని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం సినిమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని.. తన కొడుకులిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించనుండటంతో తనపై బాధ్యత పెరిగిందని నాగ్ అన్నాడు. కొడుకులిద్దరికీ సొంత బేనర్లో మంచి సినిమాలు అందిస్తానని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వాళ్లిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించబోతున్నానని.. అవి కచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాయని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

No comments:

Post a Comment