11/09/2016

జార్జియా చెక్కేస్తున్న తేజు-రకుల్

మెగా హీరో సాయి ధరం తేజ్ రీసెంట్ గా తిక్క అంటూ ఓ మూవీతో ఫ్లాప్ కొట్టాడు కానీ.. కుర్రాడు మాత్రం స్పీడ్ ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే రెండు సార్లు ఇరవై కోట్ల షేర్ సాధించేసి సక్సెస్ కొట్టిన ఉత్సాహం మెగా కుర్రాడిలో బాగానే కనిపిస్తోంది. అదే ఊపులో గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమాని తెగ స్పీడ్ గా ఫినిష్ చేసేస్తున్నాడు. 

ఈ మూవీలో తేజు ఓ ఫ్యాషన్ మేగజైన్ కి ఎడిటర్ గా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రుకుల్ రోల్ అథ్లెట్ అని తెలుస్తోంది. తేజు-రకుల్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఫారిన్ లొకేషన్స్ లో కూడా షూటింగ్ చేయాల్సి ఉండగా.. జార్జియా-టర్కీ దేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ నిర్ణయించింది. నెల రోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్ లో.. ప్రధానమైన కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. 

ఫారిన్ షెడ్యూల్ లో హీరో సాయి ధరం తేజ్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ల తో పాటు మరి కొంతమంది ప్రధానమైన యాక్టింగ్ టీమ్ కూడా ఉంటారట. ఈ నెలాఖరులో కానీ.. అక్టోబర్ తొలివారంలో కాని జార్జియా షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత నల్లమలుపు బుజ్జి చెబుతున్నారు. డిసెంబర్ నాటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. 

No comments:

Post a Comment