30/06/2016

బన్నీ-హరీష్ సినిమాలో హైలైట్స్ అవే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకునే పనిలో పడిపోయాడు దర్శకుడు. అసలు హరీష్ శంకర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేవి పంచ్ డైలాగ్స్. ఈ దర్శకుడి గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం ఈజీగా అర్ధమవుతుంది.

పవన్ కళ్యాణ్ తో 'నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది'..  ఈ ఒక్క డైలాగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెప్పించేశాడు. ఆ తర్వాత సినిమా అంతా పవన్ చెప్పే డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. రికార్డులు బద్దలైపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యాకి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా.. అలా అనాలంటే అర్హత ఉండాలి.. లేకపోతే నా అభిమాని అయుండాలి' అంటూ వేసిన పంచ్ కి నందమూరి ఫ్యాన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. రీసెంట్ గా సుబ్రమణ్యం ఫర్ సేల్ లో తేజుతో చాలానే పంచ్ డైలాగ్స్ చెప్పించాడు హరీష్ శంకర్. 

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ అంతా బన్నీ చెప్పే డైలాగ్స్ బేస్డ్ గానే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బన్నీ కొత్త లుక్ లోకి మారేందుకు కసరత్తులు స్టార్ట్ చేశాడు. అల్ట్రా స్టైలిష్ అవతారంతో.. మోస్ట్ మోడర్న్ గా డైలాగ్స్ చెప్పనున్నాడట బన్నీ. డైలాగ్ డెలివరీలో కూడా కొత్త స్టైల్ ని చూపించేందుకు ప్రయత్నించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో బన్నీ కొత్త అవతార్ ని ఫ్యాన్స్ చూసే ఛాన్స్ ఉందన్న మాట. 

మాస్ నాయక్ కి చెర్రీ గ్రీన్ సిగ్నల్

మెగా ఫ్యామిలీ హీరోలకు దర్శకుడు వి.వి.వినాయక్ అంటే విపరీతమైన నమ్మకం. మాస్ మూవీస్ విషయంలో వినాయక్ ని మించిన నాయక్ లేడని గట్టిగా నమ్ముతారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విషయంలో ముందు నుంచి వినాయక్ పేరు వినిపించింది. చివరకు స్టోరీ సంగతి ఎలా ఎటు మారినా.. చివరకు వినాయక్ చేతిలోనే ఆ సినిమాని పెట్టారు హీరో చిరంజీవి- నిర్మాత రామ్ చరణ్. 

ఎంతమంది ఎన్ని సబ్జెక్టులు చెప్పినా తను నిర్మాతగా తీసే మొదటి మూవీకి వినాయక్ నే దర్శకుడిగా రామ్ చరణ్ ఎంచుకున్నాడు. మెగా 150కోసం నెలకొన్న పోటీని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేయగలిగాడు వినాయక్. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకున్న తర్వాత తామిద్దరం ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారణ చరణ్-వినాయక్. వీరిద్దరూ కలిసి గతంలో నాయక్ చిత్రాన్ని చేసి సక్సెస్ కొట్టిన విషయం మెగాఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది. 

అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వినాయక్ ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా మెగా 150పైనే పెట్టాడు. ఆ తర్వాతే కొత్త మూవీ స్క్రిప్ట్ పై కూచోనున్నాడు. ఇక రామ్ చరణ్ అయితే ధృవను దసరాకు తెచ్చిన తర్వాత సుకుమార్ తోను.. ఆ తర్వాత మారుతీ తోను ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. అప్పటికి గానీ వినాయక్ సినిమా సంగతి తేలే ఛాన్స్ లేదు. ఇదంతా జరగడానికి 2018 వచ్చేస్తుందేమో. 

28/06/2016

పవన్ కి ఎంత క్రేజ్ ఉందంటే.. ఆ మారుమూల గ్రామంలో పవన్ రెండు రోజుల పాటు కాలు కదపలేకపోయారు

మీరా చోప్రా.. ‘బంగారం’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ తో ఆమె నటించింది. ఇటీవలే ఆమె నటించిన రెండో బాలీవుడ్ చిత్రం ‘1920 లండన్’ విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో.. పవన్ కల్యాణ్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓ బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఆ ఆసక్తికర సమాధానాన్ని ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ”నేను బాలీవుడ్ టాప్‌ హీరోలైన సల్మాన్ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లతో ఇప్పటి దాకా పని చేయలేదు.. కాబట్టి వారికున్న క్రేజ్‌ పై నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. కానీ, తెలుగులో పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో పని చేశాను కాబట్టి ఆయనకున్న సూపర్‌ క్రేజ్ గురించి నేను కచ్చితంగా చెప్పగలను. దక్షిణాదిన హీరోలను అభిమానులు దేవుళ్లలా ఎలా ఆరాధిస్తారో పవన్ కల్యాణ్ క్రేజ్ ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ ను ఆంధ్రప్రదేశ్‌ లో జరిపితే, తొక్కిసలాటలు జరగడం ఖాయమనే ఉద్దేశంతో దర్శకుడు ధరణి ఈ సినిమా షూటింగ్ ను తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూళ్లో పెట్టారు. ఆ ఊళ్లో ఎలాంటి స్టార్‌ హోటల్స్ లేకపోవడంతో ఓ చిన్న ఇంట్లో మాకు వసతి ఏర్పాటు చేయబడింది. అయితే, ఎలా లీకయిందో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలిసిపోయింది. దీంతో.. మేం ఉన్న ఇంటి చుట్టూ సడెన్‌గా సుమారు పదివేల మంది చేరిపోయారు. పవన్ కల్యాణ్ ను చూడటం కోసం అదే పనిగా వెయిట్ చేయడం ప్రారంభించారు పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే.. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఆ ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. అభిమానుల తాకిడి కారణంగా అప్పట్లో ‘బంగారం’ షూటింగ్‌ అనేక మార్లు క్యానిల్స్ అయ్యింది. న్యూయార్క్‌లో పెరిగిన నాకు దక్షిణాది హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు! అయితే పవన్‌ కల్యాణ్ తో నటించడం ద్వారా ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడగలిగా” అని మీరా చోప్రా వ్యాఖ్యానించింది

27/06/2016

చరణ్ కోసం మెగా బడ్జట్ సెట్టయ్యిందా?

మొన్నటి వరకు ఒక మెగా రూమర్ తెగ చెక్కర్లు కొట్టింది. అదేంటంటే.. అసలు రామ్ చరణ్ తో తక్కువ బడ్జెట్ లో సినిమా తీయమంటే.. మన సుకుమార్ మాత్రం చుక్కులు కనిపించే లెక్కలు చెప్పి ఆకాశమంత బడ్జెట్ అడుగుతున్నాడని. అయితే ఇవన్నీ రూమర్లే అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్టుకు ఫైనల్ టచప్ లు ఇస్తున్నాడట సుక్కూ. బడ్జెట్ తో సంబంధం లేకుండా తను అనుకున్న కథ తాను చేసుకెళ్లిపోతున్నాడట. 

నిజానికి ఇప్పటికే రామ్ చరణ్ అండ్ సుకుమార్ లు కలసి చేయబోయే ప్రాజెక్టు బడ్జెట్ పై ఒక అంచనాకు వచ్చేశారట నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఒక ప్రక్కన జనతా గ్యారేజ్ పోస్టు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే.. మరో ప్రక్కన చెర్రీతో చేసే సినిమా కోసం వీరు ప్రీ-ప్రొడక్షన్ మొదలెట్టారని తెలుస్తోంది. అనుకున్నట్లే వీరు సెప్టెంబర్ నెలలో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా రామ్ చరణ్ ఒక సినిమా పూర్తవ్వగానే ఓ ఆర్నెల్లు గ్యాప్ తీసుకోకుండా.. ఈసారి మాత్రం వెంటనే సుక్కూ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇవన్నీ చూస్తుంటే.. చెర్రీ సుకుమార్ ల సినిమా కోసం మెగా బడ్జెట్ సెట్ అయిపోయిందనే అనుకోవాలి మరి. 

ప్రస్తుతం చరణ్ కాశ్మీర్ లో తని ఒరువన్ రీమేక్ అయిన ధృవ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అది సంగతి. 

పవన్ మళ్లీ యూరోప్ వెళ్తున్నాడు తెలుసా!

పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ఫ్యామిలీతో కలిసి రష్యా టూర్ ఫినిష్ చేశాడు. ప్రస్తుతం డాలీతో చేస్తున్న తన మరుసటి సినిమా కోసం చర్చలు జరపుతున్న పవన్.. త్వరలో మరోసారి యూరోప్ వెళ్లనున్నాడు. ఈ సారి లండన్ టూర్ పెట్టుకున్న అక్కడ ఓ నృత్య కార్యక్రమానికి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొననున్నాడు.

సహజంగా డ్యాన్స్ అంటే ఆమడ దూరం ఉండే పవన్.. డ్యాన్స్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనడం కాస్త ఆశ్చర్యమే. అయితే పవన్ కి సాంప్రదాయ నృత్యాలంటే అమితమైన ఆసక్తి గౌరవం ఉన్నాయి. అందుకే జయతే కూచిపూడి ఉత్సవంలో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. యునైటెడ్ కింగ్ డం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 12 నుంచి జూలై 13వరకూ ఈ కూచిపూడి ఉత్సవాలు లండన్ లో జరుగుతున్నాయి. 

హిందూ సాంప్రదాయాలు పద్ధతులపై అమితమైన గౌరవం ఉన్న పవన్.. ఇలాంటి సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించడం ద్వారా ఐకమత్యాన్ని చాటిచెప్పచ్చనే భావనతోనే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 9న యుక్తా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పవన్ భాగమవుతాడు. ఇదిలా ఉంటే పవన్ చేయనున్న మరుసటి సినిమా.. యూరోప్ నుంచి పవర్ స్టార్ తిరిగొచ్చాక ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

మూడు నెలల్లో మళ్లీ మెగా మేనల్లుడి రచ్చ

ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని దూసుకెళ్తున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. గత ఏడాది అతడి సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఈ ఏడాది మేలో ‘సుప్రీమ్’ తో పలకరించిన సాయిధరమ్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులో తన తర్వాతి సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. ‘ఓం 3డి’  ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ ‘తిక్క’  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘తిక్క’  ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేసేయబోతున్నారట. అంటే సుప్రీమ్ వచ్చిన మూడు నెలలకే సాయిదరమ్ మరోసారి రచ్చ చేయబోతున్నాడన్నమాట.

ఇటీవలే ‘తిక్క’  టాకీ పార్ట్ కూడా పూర్తయింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాయిధరమ్-పరహ్ ల మీద ఓ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ గురించి వెల్లడించింది తిక్క యూనిట్. దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చేస్తున్న పాట కాకుండా ఇంకో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ లో చిత్రీకరిస్తే  ఇంకో పాటను లడఖ్ లో ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్నాం’ ’  అన్నాడు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

కాశ్మీర్ లో కూడా చెర్రీ అదే తంతు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కాశ్మీర్ లో కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవలో.. చెర్రీ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పాత్ర కోసం చెర్రీ కసరత్తులు ట్రైనింగ్ చూస్తే.. ఇకపై పోలీస్ పాత్ర చేసే వారందరికీ ఇన్ స్పిరేషన్ గా మిగిలిపోతాడేమో అనిపిస్తోంది. 

కొన్ని పాటలు పోలీస్ ట్రైనింగ్ సహా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు కాశ్మీర్ కి వెళ్లిన చెర్రీ అక్కడకు కూడా... మార్షల్ ఆర్ట్స్ టీమ్ ని వెంట తీసుకెళ్లాడు. అక్కడ గడ్డ కట్టే చలిలో కూడా అకిడో విద్యకు సంబంధించి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉండడం విశేషం. ఇది కాక.. ఈ మూవీ ప్రారంభానికి ముందు నుంచి సినిమాకోసం పక్కా వెజిటేరియన్ గా మారిపోయాడు రామ్ చరణ్. డైటీషియన్ చెప్పిన ఫుడ్ మినహాయిస్తే.. ఒక్క ముక్క కూడా నాన్ వెజ్ నోట పెట్టడం లేదు. 

ఇదంతా సన్నగా ఫిట్ గా కనిపించేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లావుగా కనిపించకుండా.. ధృడంగా ఉండే లుక్ కోసం చెర్రీ పడుతున్న కష్టం చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతోంది. గతంలో కూడా పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. అప్పుడు రఫ్ లుక్ లో దర్శనమిచ్చాడంతే. ఇప్పుడు మాత్రం పోలీస్ పాత్రతో సక్సెస్ సాధించేందుకు తన వంతుగా లుక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 

బోయపాటికి చిరు బంపరాఫర్ ఇచ్చారా?

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాని స్టార్ట్ చేసేశారు. 9 ఏళ్ల తర్వాత మరోసారి పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కత్తిలాంటోడు సినిమాని రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఆయన.. స్వీడ్ గా సినిమాని సిద్ధం చేయబోతున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తాను 150వ మూవీతో ఆగిపోవాలని కోరుకోవడం లేదని తేల్చేసిన చిరు.. 151 కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మాస్ సినిమాలు తీయడంలో టాలీవుడ్ టాప్ అనిపించుకున్న బోయపాటి.. చిరంజీవితో సినిమా తీసేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ఎలక్షన్స్ - రాజకీయాలతో అప్పట్లో బిజీగా ఉన్న మెగాస్టార్.. బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేశారు. 150వ సినిమాలు పెదలు పెట్టేశారు. ఈ సయమంలో మెగాస్టార్ నుంచి బోయపాటికి పిలుపు రావడం ఆశ్చర్యం కలిగించింది. 

రీసెంట్ గా బన్నీతో సరైనోడు అంటూ ఊరమాస్ సినిమా తీసి.. ఆడియన్స్ ని మెప్పించాడు బోయపాటి. ఈ దర్శకుడి టేకింగ్ - మాస్ ని మెప్పించిన తీరు చిరుకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తోంది. అందుకే తన కోసం ఓ కథ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ప్రారంభించనున్న బోయపాటి.. చిరుకోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిని కూడా ఒకేసారి చేస్తాడని తెలుస్తోంది. 

చిరు చిన్న కూతురు కూడా వచ్చేస్తోందిట

మెగా వారసులుగా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వెలిగిపోతున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలినవారుపెద్ద హీరోలుగా ఎదిగారు.. ఎదుగుతున్నారు కూడా. ఇప్పటివరకూ అబ్బాయిల రంగ ప్రవేశం అయితే.. ఇప్పుడు మెగా వారసులుగా అమ్మాయిలు పరిశ్రమలోకి వస్తున్నారు. రీసెంట్ గా నాగేంద్రబాబు కూతురు నీహారిక.. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 

మెగా డాటర్ నీహారికకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె తల్లి పద్మజ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కుమార్తెలు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా కత్తిలాంటోడు మూవీలో చిరుకు కాస్ట్యూమ్ డిజైన్ చేసినది ఆయన పెద్ద కూతురు సుశ్మితనే. ఇప్పుడు మెగాస్టార్ చిన్న కూతురు కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. అయితే.. ఈమె యాక్టర్ గా కాదు.. అలాగని అక్కలా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు కూడా కాకుండా.. మరో విభాగంలోకి ప్రవేశించనుందని తెలుస్తోంది. 

ప్రొడక్షన్ విభాగం వైపు చిరు డాటర్ శ్రీజ అడుగులు పడుతున్నాయని సమాచారం. రజినీకాంత్ కూతుళ్లు - అశ్వనీదత్ కుమార్తె మాదిరిగా సినీ నిర్మాణంలో భాగం కానుందిట. మొదట లో బడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. చిరు కుటుంబంలోంచి మరో వారసురాలు సినీ రంగం వైపు వస్తున్నట్లు ఫిక్స్ అయిపోవచ్చు. 

'మా' చిరంజీవి.. అదరహో అదరహ

మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై డ్యాన్స్ వేశారంటూ.. చిరు డ్యాన్స్ ఫినిషింగ్ ని మాత్రం టీజర్ లో చూపించి మాటీవీ తెగ ఊరించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ అభిమానులు ఆత్రంగా టీవీలకు అతుక్కు పోయేట్టు చేయడంలో బాగానే సక్సెస్ అయింది. రెండు రోజుల పాటు టీజర్ చూపించి.. రెండు నిమిషాలు మాత్రమే పెర్ఫామెన్స్ చేయడం కొంత నిరుత్సాహం కలిగించే విషయమే అయినా.. దానికి ముందు మాటీవీ అనుసరించిన స్ట్రాటజీని అదరహో అనాల్సిందే. 

దాదాపు ఒక గంటపాటు మెగా ఎపిసోడ్ ని నడిపించారు. తనికెళ్ల భరణితో స్టార్ట్ చేసి.. దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ-ఓ సాంగ్ కి పెర్ఫామెన్స్.. తర్వాత నవదీప్ స్టేజ్ పైకి వచ్చాడు. సేమ్ కాసేపు చిరు గురించి.. నెక్ట్స్ మళ్లీ ఓ సాంగ్. ఆ తర్వాత మెగామేనల్లుడు సాయిధరం తేజ్ వచ్చాడు. ఓ ఏవీ.. దానికి సాయి కుమార్ వాయిస్ ఓవర్.. ఇక తేజు కూడా ఓ మెగా సాంగ్ కి చిందులేశాడు. అప్పుడు శ్రీకాంత్ రంగ ప్రవేశం చేశాడు. అందరూ వచ్చాక మెగా స్టార్ గురించి నాలుగు మాటలు చెప్పారు. 

అప్పుడు మొదలైంది అసలు సందడి. మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి రాగానే ఆడిటోరియం అంతా స్టాండింగ్ ఒవేషన్. ఆ ఒక్క ఫ్రేమ్ చాలు.. మెగాభిమానుల గుండెలు ఉప్పొంగిపోవడానికి. మెగా 150 గురించి మెగాస్టార్ నోటి వెంట విన్నాక.. అసలు ఈవెంట్ కే హైలైట్ ప్రారంభమైంది. గ్యాంగ్ లీడర్ లో చిక్ చిక్ చేలం పాటకు చిరువేసిన డ్యాన్స్ తో మొత్తం ఆడిటోరియం మెస్మరైజ్ అయిపోయింది. 61ఏళ్ల వయసులో అంత గ్రేస్ తో మెగాస్టార్ డ్యాన్స్ చేయడం చూస్తే.. మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 

ఇక చిరు డ్యాన్స్ అయిపోయాక రామ్ చరణ్ వాటర్ బాటిల్ పట్టుకుని పరుగెత్తుకుంటూ రావడం.. బన్నీ కంటి వెంట నీరు కారిపోతుంటే తుడుచుకోవడం.. మాకోసం  మీకు ఇలాంటివి అవసరం అని నాగార్జున అనడం.. మెగాస్టార్ డ్యాన్స్ చేస్తుంటే మా ఫ్యామిలీ అందరి మొహాలు వెలిగిపోయాయి.. మొత్తం తెలుగు ఆడియన్స్ కూడా అంతే అనుకుంటున్నా అని అల్లు అరవింద్ చెప్పడం.. ఇలా చివరి గంట మొత్తం మెగా స్టార్ కి అంకితం అయిపోయింది సినీ మా అవార్డ్స్ ఫంక్షన్. 

26/06/2016

సాయం చేయడంలో పవన్ కి సాటి లేరంతే

రూపాయి దానమిచ్చినట్లుగా పోజులిచ్చి.. లక్ష ఇచ్చినట్లుగా ప్రచారం చేసి.. తర్వాత ఆ రూపాయిని కూడా జేబులో వేసుకుని పోయే రకం చాలామందే కనిపిస్తారు. కానీ పవన్ ఎన్నో సహాయాలు చేసి కూడా ఎప్పుడూ చెప్పుకున్న పాపాన పోడు. ప్రస్తుతం మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేముసైతం కార్యక్రమంలో.. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన సాయం గురించి ఓ వృద్ధురాలు చెప్పుకొచ్చింది. 

ఖమ్మంలో వృత్తి రీత్యా టీచర్ అయిన ఈమె వృద్ధాశ్రమం నడుపుతుండేది. రిటైర్ అయ్యాక భయం దాన్ని నడిపేందుకు భయం వేసిందట. అయితే పవన్ కళ్యాణ్ సాయం చేస్తాడని ఎవరో చెప్పడంతో ఇంటికి వెళ్లిందట. గేట్ దగ్గర నిలబడి అటూ ఇటూ తిరుగుతుంటే.. ఎవరో వచ్చారని పైనుంచి భార్య చెప్పడంటే.. మెట్లు దిగి వచ్చిన పవన్.. చేయి పట్టుకుని తీస్కెళ్లి కార్లో కూర్చుబెట్టుకుని ఆఫీస్ తీసుకెళ్లాడట. ఎంతమంది ఉన్నారు లాంటి ప్రశ్నలు అడిగిన తర్వాత తనే కాఫీ కలిపి ఇచ్చి.. ఫిష్ తెప్పించి వడ్డించి తినమన్నారట. 

ఇదంతా చూసి భయపడుతుంటే.. 'అమ్మా ఎందుకు భయపడుతున్నారు. నేను మీ కొడుకుని..మీరు నా అమ్మ' అంటూ పవన్ చెప్పడంతో ఆశ్చర్యపోయిందట ఈ మహిళ. చివరకు వెళ్లేటపుడు లక్ష రూపాయలు ఆమె అకౌంట్లో వేయమని చెప్పి.. మరో పదివేల రూపాయల ఖర్చులకోసం బ్యాగ్ లో వేశాడట పవన్. 3-4 ఏళ్ల క్రితం ఓ రూమర్ మాదిరిగా ఈ వార్త వచ్చినా.. ఇప్పుడు ఓ సెలబ్రిటీ షోలో పవన్ గురించి.. ఈమె చెప్పిన తీరు అందరినీ కట్టిపడేసింది. పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ప్రపంచానికి చాటి చెప్పిందీమె. పవన్ ఇలాంటి గుప్తదానాలు చాలానే చేస్తుంటాడని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. 

25/06/2016

పవన్ కోసం మరో అత్తారిల్లు?

స్వచ్ఛమైన వినోదం అందించడమే లక్ష్యమని మొన్న అఆ పాటల విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అలాంటి వినోదం కోసమే చాలా కష్టపడుతుంటానని అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయని చెప్పాడు. తదుపరి కూడా ఆయన రక్తపాతం - హింసలు లేకుండా అత్తారింటికి దారేది - అఆ తరహాలో  చిత్రం తెరకెక్కించబోతున్నాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ లో చాలా కోణాలున్నాయి. ఆయన  అత్తారింటికి దారేది - అఆలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లని తీయగలరు. అతడు - ఖలేజాలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లనీ తీయగలడు. అతడు - ఖలేజా సినిమాలు కూడా మంచి టాకే తెచ్చుకొన్నాయి కానీ... వసూళ్లు మాత్రం దక్కలేదు. అలాంటి చిత్రాలని  కుటుంబ ప్రేక్షకులు చూడరన్న విషయం అర్థమైంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్  దృష్టంతా క్లీన్ ఫ్యామిలీ కథలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబం నేపథ్యంలో  స్వచ్ఛమైన కథల్ని తీస్తే ఎన్ని  లాభాలుంటాయో ఆయనకి చివరిగా తీసిన మూడు సినిమాలతో బాగా అర్థమైంది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ సినిమా అనే టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. చివరిలోపు సినిమా హిట్ట్ అన్న టాక్ వచ్చేసింది.  

అందుకే మరోసారి అత్తారింటికి దారేది - అఆ తరహా కథనే సిద్ధం చేయడానికి పూనుకొన్నట్టు తెలుస్తోంది. తదుపరి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో ఇదివరకు కోబలిలాంటి మూవీ వస్తుందని ప్రచారం సాగింది. కానీ త్రివిక్రమ్ మాత్రం మరోసారి అత్తారింటికి దారేది తరహా సినిమానే తీయాలని అనుకొంటున్నాడట. ఇప్పటికే ఓ లైన్ కూడా ఫిక్స్ చేసుకొని దాన్ని వర్కవుట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.