08/06/2016

సుప్రీమ్ హీరో 'జవాన్'గా వస్తున్నాడు

సుప్రీమ్ మూవీతో వరుసగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించాడు సాయిధరం తేజ్. చైల్డ్ సెంటిమెంట్ - కామెడీ కంటెంట్ లకు.. కరెక్ట్ టైమింగ్ కూడా జోడవడంతో.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తేజు.. కొత్త ప్రాజెక్టులను ఓకే చేయడంలో తెగ స్పీడ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే తిక్క టైటిల్ పై రూపొందుతున్న మూవీని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చిన సాయిధరం తేజ్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నాడు. 

తిక్క కాకుండా ఇప్పటికే రెండు సినిమాలను తేజు ఓకే చేసేశాడు. ఒకటి బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనుండగా.. మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. తిక్క తర్వాత వెంటనే బీవీఎస్ రవి చిత్రాన్నే స్టార్ట్ చేస్తాడట తేజు. ఈ మూవీని కృష్ణ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేయనుండగా.. ఇతను పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడు. ఇప్పటికే సాయిధరం తేజ్ కి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ ఓ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో.. ఈ మూవీ తెరకెక్కుతుంది. 

ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందట. మొత్తానికి టైటిల్ లోనే మాంచి పవర్ చూపిస్తున్న సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ మూవీలో.. అంతకంటే ఎక్కువగానే కంటెంట్ ఉంటుందని  డైరెక్టర్ బీవీఎస్ రవి అంటున్నాడు.

No comments:

Post a Comment