30/06/2016

మాస్ నాయక్ కి చెర్రీ గ్రీన్ సిగ్నల్

మెగా ఫ్యామిలీ హీరోలకు దర్శకుడు వి.వి.వినాయక్ అంటే విపరీతమైన నమ్మకం. మాస్ మూవీస్ విషయంలో వినాయక్ ని మించిన నాయక్ లేడని గట్టిగా నమ్ముతారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విషయంలో ముందు నుంచి వినాయక్ పేరు వినిపించింది. చివరకు స్టోరీ సంగతి ఎలా ఎటు మారినా.. చివరకు వినాయక్ చేతిలోనే ఆ సినిమాని పెట్టారు హీరో చిరంజీవి- నిర్మాత రామ్ చరణ్. 

ఎంతమంది ఎన్ని సబ్జెక్టులు చెప్పినా తను నిర్మాతగా తీసే మొదటి మూవీకి వినాయక్ నే దర్శకుడిగా రామ్ చరణ్ ఎంచుకున్నాడు. మెగా 150కోసం నెలకొన్న పోటీని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేయగలిగాడు వినాయక్. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకున్న తర్వాత తామిద్దరం ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారణ చరణ్-వినాయక్. వీరిద్దరూ కలిసి గతంలో నాయక్ చిత్రాన్ని చేసి సక్సెస్ కొట్టిన విషయం మెగాఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది. 

అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వినాయక్ ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా మెగా 150పైనే పెట్టాడు. ఆ తర్వాతే కొత్త మూవీ స్క్రిప్ట్ పై కూచోనున్నాడు. ఇక రామ్ చరణ్ అయితే ధృవను దసరాకు తెచ్చిన తర్వాత సుకుమార్ తోను.. ఆ తర్వాత మారుతీ తోను ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. అప్పటికి గానీ వినాయక్ సినిమా సంగతి తేలే ఛాన్స్ లేదు. ఇదంతా జరగడానికి 2018 వచ్చేస్తుందేమో. 

No comments:

Post a Comment