29/07/2016

మలేషియాలో మంచు - కొణిదెల ఫ్రెండ్స్!

తెలుగుసినిమా ఇండస్ట్రీలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక జంట స్నేహం మాత్రం బలే విచిత్రంగా ఉంటుంది. ఏ విషయమైనా బహిరంగంగా కుండబద్దలు కొట్టేసుకుంటారు.. అంతే ఆత్మీయంగా ఒకరినొకరు అభినందించుకుంటూ - పొగిడేసుకుంటారు. ఇప్పటికే తెలిసింది కదా ఆ స్నేహితులు చిరంజీవి - మోహన్ బాబు అని. వీరిద్దరి గురించి తెలిసినవారు వీరిది టాం అండ్ జెర్రీ బందమని జోక్స్ వేస్తుంటారు కూడా. వీరిసంగతి కాసేపు పక్కనపెడితే... వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ మాంచి స్నేహితులుగానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ వీరిమధ్య సాన్నిహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.

ఎప్పుడూ రామ్ చరణ్ - మంచు లక్ష్మీ కలిసి కనిపిస్తుంటారు కానీ... వీరిద్ధరూ వీరివీరి లైఫ్ పార్ట్నర్స్ తో కనిపించిన సందర్భాలు పెద్దగా కనిపించవు! అయితే తాజాగా రామ్ - ఉపాసన - మంచు లక్ష్మీ - ఆండీ శ్రీనివాస్ లు కలిసి వీకెండ్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేశారట. ఈ పార్టీ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ... మంచులక్ష్మీ తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసింది. థాయ్ లాండ్ లోని ఖోసముయ్ అనేప్రాంతంలో వీరంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో ఉపాసన - రామ్ చరణ్ - మంచులక్ష్మీ - ఆమె భర్త ఆండీ శ్రీనివాస్ తో పాటు మరికొందరు కూడా జాయిన్ అయ్యారట. వీరి స్నేహాలను చూసి.. అభిమానులు కూడా ఇలా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కొందరు ఆశావాదులు!

కామెంట్: చిరు స్ట్రెంగ్త్ చాటిచెప్పిన వీక్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ అనగానే టాలీవుడ్ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే చిరు రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇంతగా మెగాస్టార్ మీద సినీ జనాలు దృష్టి పెట్టడానికి కారణం.. పీక్ స్టేజ్ లో చిరు వెలిగిన తీరే. 

ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ అని తెలిసిందే. ఇండియన్ సినిమా స్క్రీన్ కి మాస్ సొగసులు అద్దాడాయన. అయితే బచ్చన్ కంటే ఎక్కువగా చిరంజీవి రేంజ్ ఉండేదని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. వీక్ అనే లీడింగ్ మేగజైన్.. 'బిగ్గర్ దేన్ బచ్చన్' అంటూ చిరంజీవిపై స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. 

ఆ మేగజైన్ పబ్లిష్ అయినది 1992లో. అప్పట్లో బిగ్ బీ ఒక్కో సినిమాకి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటే.. చిరంజీవికి నిర్మాతలు కోటీ పాతిక లక్షలు చేతిలో పెట్టేవారు. ఈ మేగజైన్ వచ్చేనాటికి చిరు రేంజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసా? 

1990లో కొండవీటి దొంగ.. జగదేకవీరుడు అతిలోక సుందరి.. కొదమసింహం.. హిందీలో ప్రతిబంధ్.. 1991లో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ - గ్యాంగ్ లీడర్ - రౌడీ అల్లుడు - 1992లో ఘరానా మొగుడు రిలీజ్ అయిన తర్వాత.. రాసిన స్పెషల్ స్టోరీ అది. అంటే రెండున్నరేళ్లలో 8 సినిమాలు వస్తే 6 బ్లాక్ బస్టర్స్ - రెండు యావరేజ్ గా ఫేర్ చేశాయి. 

బన్నీకి ఇష్టమైన ఇతర హీరోలు..

అల్లు అర్జున్ అంటే స్టయిలిష్ స్టార్ అని తెలిసిందే. తెలుగులోనే కాకుండా మలయాళం కూడా మనోడు హిట్టయ్యాడు. ఇప్పుడు సరైనోడు సినిమా కూడా మలయాళంలో బాగా ఆడేసింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన బన్నీ.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. తనకు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సరే.. ఇంతకీ మనోడు ఎవరి ఫ్యాన్? అయితే బన్నీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని ఊరందరికీ తెలుసు.. మరి ఆయన కాకుండా ఇంకెవరి ఫ్యానో తెలుసా? 

నిజానికి బన్నీ ఆల్ టైమ్ ఫేవరేట్ ఎవరంటే.. స్టయిల్ ఐకాన్.. మైఖేల్ జాక్సన్. అందుకే ఫిలిం నగర్లోని తన డ్యాన్సు ప్రాక్టీసింగ్ హాల్లో మనోడు జాక్సన్ ఫోటో మరియు చిరంజీవి ఫోటోలను పెట్టుకున్నాడు. ఇక హాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడు లియోనార్డో డికాప్రియో అని.. అలాగే హిందిలో ఎప్పటికీ అమిత్ బచ్చన్ సాబ్.. అమీర్ జి.. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నచ్చుతున్నాడని తెలియజేశాడు. తమిళంలో అయితే ధనుష్.. విజయ్ సేతుపతి.. బాగా నచ్చేశారట. ఈ మధ్యన విజయ్ కూడా నచ్చుతున్నాడటలే. ఇక తెలుగులో ఫేవరేట్ ఎవరు అని అక్కడి మీడియావారు ఎవ్వరూ అడగలేదు. మరి చిరంజీవి కాకుండా వేరే పేర్లు చెప్పాల్సి వస్తే.. బన్నీ ఏం చెప్పేవాడో. 

ఇదంతా సరే.. ఇంతకీ కొత్త సినిమా ఎప్పుడు ఎవరితో మొదలెడుతున్నావ్ బన్నీ? హరీశ్ శంకర్ తో చేస్తున్నావా లేదంటే విక్రమ్ తో చేస్తున్నావా.. ముందు ఆ విషయం చెప్పు. 

26/07/2016

హై ఫై బార్ పెడుతున్న బన్నీ

అబ్బో.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో బిజినెస్ పెడుతున్నరుగా. నాగార్జున హోటల్స్.. రవితేజ ఇన్వెస్టుమెంట్స్.. రామ్ చరణ్ ఎయిర్ లైన్స్.. చిన్న హీరోల రెస్టారెంట్స్.. ఇలా అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళతో నేనెందుకు జాయిన్ అవ్వకూడదు అంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. 

యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బారు వారితో కలసి.. ఇప్పుడు హైదరాబాదులో ఒక కొత్త కాన్సెప్టు ఓరియెంటెడ్ నైట్ క్లబ్ పెడుతున్నాడు బన్నీ. ''యం కిచెన్స్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే సంస్థలు నన్ను ఎప్రోచ్ అయినప్పుడు.. పెద్దగా ఆలోచించాలని అనిపించలేదు. వారితో కలసి ''800 జూబిలీ'' అనే క్లబ్ పెడుతున్నాం'' అంటూ ప్రముఖ పత్రిక టైమ్స ఆఫ్ ఇండియా వారికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మన సినీ హీరో. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రాబోతున్న ఈ క్లబ్ లో ఒక కేఫ్ - జపానీస్ రెస్టారెంట్ - బార్బిక్యూ రెస్టారెంట్ వగైరా ఉంటాయట. క్లబ్ లో స్వయంగా వారే తయారుచేసిన బీర్లు వగైరా కూడా దొరుకుతాయి. 

జూలై 29న స్వయంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ క్లబ్ ఓపెన్ చేయనున్నారట. ఇప్పటివరకు బ్రూయింగ్ అంటే తెలియకుండా ఓన్లీ సీల్డ్ ఆల్కహాల్ తాగిన హైదరాబాదుకు కొత్త రుచిని చూపిస్తాం అంటున్నారు ఈ క్లబ్ పార్టనర్లు. 

'మెగాస్టార్' రేడియో తెగ నచ్చేసిందట

మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ.. తమకు వీలుచిక్కినా లేదంటే అవకాశం వచ్చినా.. 'మెగాస్టార్ చిరంజీవి' గురించి చెప్పడానికి ఇష్టపడతారు. పవన్ నుండి వరుణ్ తేజ్ వరకు.. అందరూ ఇదే తంతు. వీరందరూ కూడా మెగాస్టార్ కు మెగా ఫ్యాన్సే. ఇదిగో ఇవాళ తన ఫ్యానిజం ఎలా ఉంటుందో చూపించేశాడు మెగా ప్రిన్స్. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ''మిష్టర్'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఈ కుర్రాడు ఏమంటున్నాడంటే..

వరుణ్ తేజ్ రోజూ హోటల్ నుండి షూటింగ్ స్పాటుకు వెళ్ళడానికి ఒక కారు వాడుతున్నాడు. ఆ కారులో మనోడు ఎఫ్.ఎం. రేడియో వింటుంటాడు. ఇంతకీ మనోడు వినే రేడియో ఛానల్ పేరేంటో తెలుసా? ''మెగాస్టార్ FM'' స్పెయిన్లో ఈ రేడియో బాగా పాపులర్. ఒకవేళ అది పాపులర్ కాకపోయినా కూడా.. ఆ ఛానల్ వారు మెగాస్టార్ అనే పేరును పెట్టుకున్నారు కాబట్టి.. ఆ ఛానలే వింటాను అంటున్నాడు వరుణ్ తేజ్. దటీజ్ మెగాస్టార్ లవ్ అంటూ చెప్పుకొచ్చాడు కూడా. 

శ్రీను వైట్ల డైరక్షన్లో రూపొందుతున్న ''మిష్టర్'' సినిమా షూటింగ్ దాదాపు స్పెయిన్లోనే జరుగుతుందట. త్వరలోనే హీరోయిన్లు లావణ్య త్రిపాఠి మరియు హెబ్బా పటేల్ స్పెయిన్ చేరుకుంటారని తెలుస్తోంది. అది సంగతి. 

ట్రైలర్ టాక్: శ్రీరస్తు అదరిందిగా..

శ్రీరస్తు.. శుభమస్తు.. మెగా ఫ్యామిలీ హీరో నుంచి రాబోతున్న మరుసటి మూవీ. సోలో ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక అప్పుడు ఒక్కో అప్ డేట్ చొప్పున ఇస్తూ క్రేజ్ తీసుకొచ్చారు. అలాగే ఒక్కోపాటను విడుదల చేస్తూ.. హైప్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడీ శ్రీరస్తు..శుభమస్తుకి థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ అయింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ ఇరగదీసేశారంతే. అటు కామెడీ నుంచి ఇటు పంచ్ డైలాగ్స్ వరకూ.. ఎమోషన్స్ నుంచి  సెంటిమెంట్స్ వరకూ సూపర్బ్ గా కుదిరాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే.. ఎంత అందంగా కనిపించిందో.. అంతే అల్లరి చేసేసింది. హీరోని ఓ సారి అన్నయ్య అని.. ఓ సారి తమ్ముడు అని ఆడేసుకుందంతే. ఇక హీరో అల్లు శిరీష్ గురించి అయితే  చాలానే చెప్పుకోవాలి. మొదటి రెండు సినిమాలతో పోల్చితే.. చాలా మెచ్యూర్ అయ్యాడు. 

కామెడీ విషయంలో అల్లు శిరీష్ టైమింగ్ ని సూపర్ గా వాడుకున్నాడు దర్శకుడు. ఇందుకు చివర్లో వచ్చే డైలాగ్ 'మేడమ్ - నేనే బ్లాక్ మెయిల్ చేసేట్లయితే.. మీ దగ్గర్నుంచి చాలా అడగ్గలను' అంటూనే అమ్మాయి బాడీని పైనుంచి కిందవరకూ చూసే సీన్ బాగా పేలింది. రావు రమేష్ డైలాగ్ కూడా ట్రైలర్ లో కీలకం. మొత్తానికి భారీ కాస్టింగ్ తో వస్తున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

24/07/2016

చిరు చేతిలో తన్నులు తినేది అతనే

'కత్తి' సినిమాలో హీరో విజయ కంటే విలన్ నీల్ నితిన్ ముఖేష్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. చాలా అందగాడు. పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రీమేక్ కోసం అలాంటి అబ్బాయినే ఒకరిని వెతకాలి. అందుకోసమే ముందు జగపతిబాబును అడిగుంటారు.. కాకపోతే యంగ్ బిజినెస్ మ్యాన్ అయితేనే పాత్రకు కిక్ వస్తుంది కాబట్టి.. డ్రాప్ అయిపోయి ఉంటారు. ఇంతకీ చిరు చేతిలో తన్నులు తినే ఆ విలన్ ఎవరు అవ్వబోతున్నారు? 

ఇప్పటికే బాలీవుడ్లో ఓ ఇద్దరి ముగ్గురిని సంప్రదించగా.. నేను చేస్తా అంకుల్ అంటూ వివేక్ ఒబెరాయ్ ముందుకొచ్చాడట. ఆ మధ్య కాలంలో రక్త చరిత్ర సినిమాలో మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో ఉర్రూతలూగించిన వివేక్ ఒబెరాయ్.. తెలుగులో పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి సన్నద్దంగా ఉన్నట్లు ఎప్పుడో చెప్పాడు. కాకపోతే సరైనోడు సినిమాలో చేయమని అడిగినప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీ షూటింగ్ కారణంగా చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడు చిరు 150వ సినిమాలో ఆ ఛాన్సును మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నాడట. చిరంజీవి ఢిల్లీ టూర్ ముగియగానే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్సుంది. 

ఇకపోతే విలన్ సంగతి ఎలా ఉన్నా కూడా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు మాష్టారూ? ముందు ఆ విషయం చెప్పండి. 

22/07/2016

చిరు-150.. ఈ కొత్త ట్విస్టేంటో?

హీరోయిన్ ఎవరో తేల్చకుండానే సినిమా ప్రారంభోత్సవం అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఒక షెడ్యూల్ అవగొట్టేసి రెండో షెడ్యూల్ కు కూడా శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇప్పటిదాకా చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఎవరన్నది తేలలేదు. ఓ పక్క షూటింగ్ అవుతూ ఉంటే.. ఇంకో పక్క హీరోయిన్ని ఫైనలైజ్ చేసేద్దాంలే అనుకున్నారు. కానీ చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. బాలీవుడ్ హీరోయిన్ ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి హీరోయిన్ ఎవరో తేలక షూటింగే ఆపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే ఇక లాభం లేదని హీరోయిన్ విషయంలో కాస్త రాజీ పడటానికే నిర్ణయించుకుందట ‘చిరు-150’ టీమ్.

ఫేడవుట్ అయిపోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసినట్లుగా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. వేరే ఆప్షన్లు ఏమీ కనిపించని నేపథ్యంలో చందమామకే ఓటేసినట్లు చెబుతున్నారు. ఐతే కాజల్ చిరు పక్కన హీరోయిన్ అనే విషయాన్ని అభిమానులు ఎలా జీర్ణించుకుంటారన్నది డౌటు. కాజల్ ఆల్రెడీ చరణ్ పక్కన ఒకటికి మూడు సినిమాల్లో నటించింది. మరి తండ్రి పక్కనా హీరోయిన్ అంటే కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. చరణ్ తో చేశాక.. పవన్ తో చేసింది కదా ఇబ్బందేంటి అనిపించొచ్చు. బాబాయితో నటించడం వేరు. మరీ తండ్రి సరసన చిందులేయడం వేరు. పైగా సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లతో కాజల్ మీద నెగెటివ్ ముద్ర పడిపోయింది. పైగా ఆమెలో మునుపటి గ్లో కూడా కనిపించట్లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆమెను హీరోయిన్ గా ఫైనలైజ్ చేస్తారా అన్నది డౌటు.

20/07/2016

నా ఫ్యామిలీ పెరుగుతోంది -అల్లు అర్జున్

తన కొడుకు అల్లు అయాన్ జీవితంలో ప్రతీ ఒక్క మూమెంట్ కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నిరంతరం తపిస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే మనోడు ఎప్పటికప్పుడు తన వైఫ్ స్నేహ రెడ్డి తో కలసి ఆయాన్ ను అనేక విధాలుగా ఫోటో షూట్లు చేసి.. అవన్నీ సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ఫీట్ మరొకటి చేశాడు. 

''మా ఫ్యామిలీ ఇంకాస్త పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఫ్యామిలీలోకి ఇంకో లిటిల్ బేబి రాబోతుంది'' అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు బన్నీ. తన కొడుకు అయన్.. తల్లి స్నేహ కడుపును ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటో ఎంతో మురిపెంగా ఉంది. పైగా స్నేహ ప్రెగ్నెన్సీ న్యూస్ ను ఇలా తనే సొంతంగా షేర్ చేసుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం. హీరోలందరూ ఇలాంటి వార్తలను గోప్యంగా ఉంచాలని చూస్తే.. బన్నీ మాత్రం తన లైఫ్ ను అనుక్షణం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

కంగ్రాట్స్ అల్లు అర్జున్. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని తుపాకి.కాం తరుపున విషెస్ తెలియజేస్తున్నాం. 

మాల్డీవుల్లో పవన్ పిల్లల హంగామా!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటుంది. అభిమానులతో తన భావాలను పంచుకుంటూ ఉండడం రేణుకు బాగా అలవాటు. అలాగే అవసరమైన సందర్భాల్లో వెంటనే స్పందిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకోవడం రేణూ దేశాయ్ స్పెషాలిటీ. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ మాల్దీవ్స్ లో విహరిస్తోంది. 

మాల్దీవ్స్ బీచ్ లలో కొడుకు అకీరా నందన్- కూతురు ఆద్యలతో కలిసి చక్కర్లు కొడుతోంది ఆద్య. ' అందరూ స్కూల్స్ కి వెళ్లిపోవడం మొదలుపెట్టాక.. చివరకు మేము మా సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించాం' అంటూ ట్వీట్ చేసిన పవన్ మాజీ వైఫ్.. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.  పిల్లలిద్దరూ కెమేరాకు పోజులిస్తున్న ఫోటో ఒకటి.. వాళ్లిద్దరితో కలిసి బీచ్ లో తాను నిలబడి ఉన్న ఫోటో మరొకటి.. బీచ్ అందాలను చూపిస్తూ.. ఎంత నీలంగా ఎప్పుడూ చూడలేదంటూ మరొక ఫోటోను ట్వీట్ చేసింది రేణు.

ఈ ఫోటోల్లో మాల్దీవ్స్ అందాల కంటే.. పవన్ కుమారుడు అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాడు. తల్లితో సమానమైన హైట్ ఉండి.. అప్పుడు ఎంత పెద్దోడయ్యాడు అనిపించేలా ఉన్నాడు అకీరా నందన్. చిన్నారి ఆద్య అయితే ముద్దులొలికే నవ్వులతో ఆకట్టుకుంటోంది. 

19/07/2016

బన్నీ మళ్లీ మార్చేస్తున్నాడు

ఒకే రకమైన క్యారెక్టర్లు.. ఒకే రకమైన లుక్ తో కనిపిస్తే ఈ రోజుల్లో కష్టం. కథలు మారుతున్నాయి. క్యారెక్టర్లు మారుతున్నాయి. లుక్స్ కూడా మార్చాల్సిందే. అల్లు అర్జున్ గత మూణ్నలుగు సినిమాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రకంగా కనిపించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కి.. ‘రుద్రమదేవి’కి.. ‘సరైనోడు’కు.. ఒకదాంతో ఒకదానికి పోలిక ఉండదు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో కూడా లుక్ మార్చేస్తున్నాడట బన్నీ. ‘సరైనోడు’ విడుదలనప్పటి నుంచి బన్నీ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం పెంచినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ గడ్డంతో కనిపిస్తున్నాడు. 

బహుశా తన కొత్త సినిమాలో బన్నీ గడ్డంతోనే కనిపించవచ్చని అంటున్నారు. ‘రుద్రమదేవి’లో బన్నీ చేసింది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. హరీష్ దర్శకత్వంలో పూర్తిగా సినిమా అంతా గడ్డంతో కనిపించే అవకాశముంది. ఈ గడ్డంతో ప్రయోగాలు చేసి.. స్టైలింగ్ తర్వాత ఓ లుక్ ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. స్క్రిప్టు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినట్లు సమాచారం. సెప్టెంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ సంగతి తేలాల్సి ఉంది. ఇంతకుముందు బన్నీతో ఆర్య.. పరుగు సినిమాలు తీసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి గారికి సారీ చెబుతున్నాను

మెగాస్టార్ చిరంజీవితో అనేక సూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి. ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈయన చిరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కనుక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే కామెడీ - లవ్ - యాక్షన్ - డ్యాన్స్ లు ఉండే సినిమా చేస్తానని.. చిరంజీవి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే జనాలు చూడరని కోదండరామిరెడ్డి అనడం కాంట్రవర్సీగా మారింది. 

అప్పుడు జరిగిన సంఘటనపై ఈ సీనియర్ దర్శకుడు మళ్లీ స్పందించారు. ఆంధ్రజ్యోతి పేపర్ కి వివరణ ఇస్తూ.. 'ఆ రోజు నేనేం మాట్లాడానో తర్వాతే ఆ తర్వాత పేపర్లలోను వెబ్ సైట్లలో చూశాకే అర్ధమైంది. అవన్నీ చూశాక నేను ఇలా మాట్లాడానా అని బాధపడ్డాను. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. నాకు తెలియకుండానే ఏదో ఫ్లోలో ఆ రెండు మాటలు అనేశాను. చిరంజీవి గారితో నేను చాలా సినిమాలు చేశా. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది. నేను కూడా చాలా ఫ్లాప్ సినిమాలు తీశాను. ఫలానా జోనర్ లో తీయమని చెప్పడానికి అలా చేస్తే ఆడతాయని చెప్పడానికి నేనేమీ దేవుడిని కాదు. పొరపాటుగా మాట్లాడినందుకు చిరంజీవి గారికి - నిర్మాత చరణ్ కి - వివి వినాయక్ కు - మెగాభిమానులకు పత్రికా ముఖంగా సారీ చెబుతున్నాను' అన్నారు కోదండరామిరెడ్డి.

తప్పు చేసి తలెగరేసే ఈ రోజుల్లో.. యథాలాపంగా అన్న మాటలకు ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చిన కోదండరామిరెడ్డిని అభినందించాల్సిందే. 

ఉపాసన ప్లాన్స్ అన్నీ అందుకోసమేనా!!

ఈ మధ్యన రామ్ చరణ్ కోసం ఏకంగా ముంబయ్ నుండి ఒక పి.ఆర్. ఏజన్సీని దించింది ఆయన భార్య ఉపాసన కామినేని. అయితే ఈ ఏజన్సీ వారు కేవలం ఏదో ఏజన్సీ అన్నట్లు కాకుండా.. అసలు ముంబయ్ టచ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చరణ్ చేత స్వయంగా ఇంటర్యూలు పెట్టించడం.. అన్ని లీడింగ్ మీడియా హౌసుల్లోనూ చరణ్ గురించి కవరేజ్ విపరీతంగా పెంచడం వంటి చేస్తున్నారు. మామూలుగానే ఈ మెగా హీరోకు ఉన్న క్రేజ్ కారణంగా ఏదైనా వార్తే అవుతుంది. ఇక స్వయంగా ఒక ఏజన్సీ రంగంలోకి దిగి ఆ పనిచేస్తుంటే.. ఇంకేముంది క్రేజ్ డబుల్ అవుతుంది. 

అసలు ఉపాసన ఇంత కేర్ తీసుకోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ కేవలం మెగా క్రేజ్ పైనే ఆధారపడ్డాడు కాని.. సొంతంగా బ్రాండింగ్ చేసుకోలేదు. గతంలో నమ్రతా శిరోద్కర్ ఎలాగైతే మహేష్ ను ఒక బ్రాండ్ గా తీర్చిదిద్ది ఏకంగా డజను బ్రాండ్ల తాలూకు యాడ్స్ అతని చేతిలోకి తెచ్చిందో.. ఇప్పుడు ఉపాసన కూడా సేమ్ అదే ఫాలో అవుతోందట. మొదట కార్పొరేట్ కంపెనీల యాడ్లను తెచ్చి.. తరువాత పెద్ద పెద్ద ప్రాడక్టులను కొన్ని చరణ్ ఖాతాలో వేయిస్తుందట. దాని తరువాత బాలీవుడ్డులో వీలైతే మరో రెండు సినిమాలను కూడా చరణ్ చేత సైన్ చేయిస్తారని తెలుస్తోంది. ఆ దిశగానే ఉపాసన ప్లాన్స్ అమలవుతున్నాయి. 

ఇవన్నీ చేయడం వలన బ్రాండ్ వాల్యూ పెరగడమే కాదు.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చరణ్ తో సినిమాలను చేయడానికి క్యూ కట్టే ఛాన్సుంది. అయితే ఇలాంటి బ్రాండింగ్ ఎంత చేసినా కూడా.. కంటెంట్ వైజ్ మంచి సినిమాలను సెలక్టు చేసుకుని హిట్లు కూడా కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. 

18/07/2016

కేరళలోనూ 24 సెంటర్లలో 50 రోజులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన సరైనోడుకి మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయింది. 

తెలుగులో సరైనోడు పేరిట చాలానే రికార్డులున్నాయి. ఇప్పుడీ మూవీ మలయాళ వెర్షన్ యోధావు మల్లూవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళలో ఇప్పటికే 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా.. 24 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. బన్నీకి కేరళలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇంతటి విజయాన్ని అందించిన మలయాళీ ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పేందుకు కేరళ స్టైలిష్ స్టార్ వెళ్లనున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత రిలీజ్ చేయడం మలయాళ వెర్షన్ కి బాగా కలిసొచ్చింది. 

తెలుగులో అయితే 75.75 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ టాప్ 5లో నిలిచిన సరైనోడు ఖాతాలో మరిన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ఏఢాది ఇప్పటివరకూ బిగ్గెస్ట్ హిట్ ఇదే కాగా.. బన్నీ కెరీర్ లో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ సరైనోడు. ఈ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. తన నెక్ట్స్ మూవీని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం కానున్న ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.