01/07/2016

చెర్రీ.. లుక్ తోనే చితక్కొట్టేశాడు

 రామ్ చరణ్ ఇప్పుడు హైద్రాబాద్ వచ్చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తని ఒరువన్ రీమేక్ ధృవ షూటింగ్ కోసం.. కశ్మీర్ వెళ్లింది యూనిట్. ఇప్పుడు అక్కడ షెడ్యూల్ ని ఫినిష్ చేసిన రామ్ చరణ్..  హైద్రాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇలా కెమేరాలకు చిక్కాడు చరణ్.

10 రోజులకు పైగా జరిగిన కశ్మీర్ షెడ్యూల్ లో.. ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది చెర్రీ లుక్ గురించే. ఐపీఎస్ ఆఫీసర్ లుక్ కోసం కొన్ని నెలల పాటు శ్రమించిన చరణ్.. అథ్లెటిక్ బాడీకి మేకోవర్ చేశాడు. నీట్ గా షేవ్ చేసిన గడ్డం.. స్టిఫ్ బాడీ.. ధృడంగా ఉంటూ సన్నగా కనిపించే లుక్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. ఇలా ప్రతీ విషయంలోనూ కొత్తగా కనిపించేందుకు కొన్ని నెలల పాటు ట్రైనప్ అయ్యాడు చరణ్. 

ఆ కష్టం ఇప్పుడు చరణ్ లుక్ లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూకలర్ షర్ట్ - బ్లూ జీన్స్ - బ్లూ క్యాప్ లో చెర్రీ అలా నడిచొస్తున్న లుక్.. ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో షూటింగ్ స్పాట్ నుంచి తీసిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రీసెంట్ పోలీస్ లుక్ లో ఉన్న ఫోటోన షేర్ చేశాడు నవదీప్. ఇప్పుడు పూర్తి లుక్ తో కశ్మీర్ షూటింగ్ నుంచి తిరిగొస్తూ... శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమేరాలకు దొరికిపోయాడు రామ్ చరణ్. 

No comments:

Post a Comment