20/07/2016

మాల్డీవుల్లో పవన్ పిల్లల హంగామా!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటుంది. అభిమానులతో తన భావాలను పంచుకుంటూ ఉండడం రేణుకు బాగా అలవాటు. అలాగే అవసరమైన సందర్భాల్లో వెంటనే స్పందిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకోవడం రేణూ దేశాయ్ స్పెషాలిటీ. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ మాల్దీవ్స్ లో విహరిస్తోంది. 

మాల్దీవ్స్ బీచ్ లలో కొడుకు అకీరా నందన్- కూతురు ఆద్యలతో కలిసి చక్కర్లు కొడుతోంది ఆద్య. ' అందరూ స్కూల్స్ కి వెళ్లిపోవడం మొదలుపెట్టాక.. చివరకు మేము మా సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించాం' అంటూ ట్వీట్ చేసిన పవన్ మాజీ వైఫ్.. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.  పిల్లలిద్దరూ కెమేరాకు పోజులిస్తున్న ఫోటో ఒకటి.. వాళ్లిద్దరితో కలిసి బీచ్ లో తాను నిలబడి ఉన్న ఫోటో మరొకటి.. బీచ్ అందాలను చూపిస్తూ.. ఎంత నీలంగా ఎప్పుడూ చూడలేదంటూ మరొక ఫోటోను ట్వీట్ చేసింది రేణు.

ఈ ఫోటోల్లో మాల్దీవ్స్ అందాల కంటే.. పవన్ కుమారుడు అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాడు. తల్లితో సమానమైన హైట్ ఉండి.. అప్పుడు ఎంత పెద్దోడయ్యాడు అనిపించేలా ఉన్నాడు అకీరా నందన్. చిన్నారి ఆద్య అయితే ముద్దులొలికే నవ్వులతో ఆకట్టుకుంటోంది. 

No comments:

Post a Comment