27/06/2016

మూడు నెలల్లో మళ్లీ మెగా మేనల్లుడి రచ్చ

ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని దూసుకెళ్తున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. గత ఏడాది అతడి సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఈ ఏడాది మేలో ‘సుప్రీమ్’ తో పలకరించిన సాయిధరమ్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులో తన తర్వాతి సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. ‘ఓం 3డి’  ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ ‘తిక్క’  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘తిక్క’  ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేసేయబోతున్నారట. అంటే సుప్రీమ్ వచ్చిన మూడు నెలలకే సాయిదరమ్ మరోసారి రచ్చ చేయబోతున్నాడన్నమాట.

ఇటీవలే ‘తిక్క’  టాకీ పార్ట్ కూడా పూర్తయింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాయిధరమ్-పరహ్ ల మీద ఓ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ గురించి వెల్లడించింది తిక్క యూనిట్. దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చేస్తున్న పాట కాకుండా ఇంకో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ లో చిత్రీకరిస్తే  ఇంకో పాటను లడఖ్ లో ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్నాం’ ’  అన్నాడు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

No comments:

Post a Comment