15/06/2016

ఫ్యాన్స్ కోసం చెర్రీ చేసిన ఛేంజెస్

రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు ధృవ షూటింగ్ లో మహా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని రీమేక్ చేయాలని ఫైనలైజ్ చేశాక.. తెలుగు ఆడియన్స్ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేశారనే టాక్ వినిపించింది. అయితే.. సూరి చేసిన ఛేంజెస్ అంతగా ఆకట్టుకోకపోవడం తమిళ వెర్షన్ ఇంకా పటిష్టంగా ఉండడం.. అసలు కోలీవుడ్ మూవీకి ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదని చిరు సూచించడంతో.. సేమ్ డిట్టో దించేసేలా సినిమా రెడీ అవుతోంది. 

కోలీవుడ్ సినిమానే యాజ్ ఇట్ఈజీ గా ఫాలో అవుతారని తెలియడంతో.. చెర్రీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇందుకు కారణం.. ఒరిజినల్ వెర్షన్ లో పాటలకు అంతగా స్కోప్ లేకపోవడమే. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం రామ్ చరణ్ నుంచి కచ్చితంగా డ్యాన్స్ నెంబర్స్ కోరుకుంటారనే విషయంలో సందేహం అక్కర్లేదు. అందుకే తమిళ్ సినిమాలో.. పాటల మేరకు మార్పులు ఉండేలా చరణ్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చెర్రీకి చాలా ఇష్టమైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. డ్యాన్స్ మూమెంట్స్ సమకూర్చనున్నాడు. 

ఈ మార్పులే కాదు.. తన గెటప్ లోనూ చరణ్ మేకోవర్ చూపించిన విషయం ప్రీ లుక్ తోనే తెలిసిపోయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ధృవ.. త్వరలో 12 రోజుల షెడ్యూల్ కోసం కశ్మీర్ కు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి జూలై ఫస్ట్ వరకూ కశ్మీర్ షెడ్యూల్ ఉండనుంది. 

No comments:

Post a Comment