27/06/2016

కాశ్మీర్ లో కూడా చెర్రీ అదే తంతు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కాశ్మీర్ లో కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవలో.. చెర్రీ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పాత్ర కోసం చెర్రీ కసరత్తులు ట్రైనింగ్ చూస్తే.. ఇకపై పోలీస్ పాత్ర చేసే వారందరికీ ఇన్ స్పిరేషన్ గా మిగిలిపోతాడేమో అనిపిస్తోంది. 

కొన్ని పాటలు పోలీస్ ట్రైనింగ్ సహా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు కాశ్మీర్ కి వెళ్లిన చెర్రీ అక్కడకు కూడా... మార్షల్ ఆర్ట్స్ టీమ్ ని వెంట తీసుకెళ్లాడు. అక్కడ గడ్డ కట్టే చలిలో కూడా అకిడో విద్యకు సంబంధించి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉండడం విశేషం. ఇది కాక.. ఈ మూవీ ప్రారంభానికి ముందు నుంచి సినిమాకోసం పక్కా వెజిటేరియన్ గా మారిపోయాడు రామ్ చరణ్. డైటీషియన్ చెప్పిన ఫుడ్ మినహాయిస్తే.. ఒక్క ముక్క కూడా నాన్ వెజ్ నోట పెట్టడం లేదు. 

ఇదంతా సన్నగా ఫిట్ గా కనిపించేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లావుగా కనిపించకుండా.. ధృడంగా ఉండే లుక్ కోసం చెర్రీ పడుతున్న కష్టం చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతోంది. గతంలో కూడా పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. అప్పుడు రఫ్ లుక్ లో దర్శనమిచ్చాడంతే. ఇప్పుడు మాత్రం పోలీస్ పాత్రతో సక్సెస్ సాధించేందుకు తన వంతుగా లుక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 

No comments:

Post a Comment