05/09/2016

హాంకాంగ్ టు హైద్రాబాద్.. బన్నీ ఫోకస్

డీజే.. దువ్వాడ జగన్నాథం అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయిపోయాయి. అనౌన్స్ మెంట్ అయితే తాజాగానే వచ్చింది కానీ.. నిర్మాత దిల్ రాజు- దర్శకుడు హరీష్ శంకర్ ల దగ్గర కన్ఫర్మేషన్ ముందు నుంచే ఉందిట. 

డీజేకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పార్ట్ అంతా హైద్రాబాద్- హాంకాంగ్ లలోనే జరుగనుందని అంటున్నారు. సినిమాలో హాంగ్ కాంగ్ కి సంబంధించిన సీన్స్ కాస్త తక్కువగా ఉన్నా.. స్టోరీ బేస్ అంతా అక్కడి నుంచే ఉంటుందని.. అక్కడ తీయబోయే సీన్స్ మూవీకి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఇక హైద్రాబాద్ లో ఎక్కువ భాగం షూట్ చేసి.. పాటల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేయబోతున్నారట. 

ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించిన దువ్వాడ జగన్నాథం అండ్ టీం.. ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమగాధ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని ఫైనల్ చేశారనే టాక్ ఉంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత కాగా.. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయానకా బోస్ ను టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించనున్న ట్యూన్స్.. బన్నీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమే.

No comments:

Post a Comment