12/09/2016

అవకాశమిస్తే చిరుతో 151వ సినిమా చేస్తా

రామ్ లీలా - జీనియస్ లాంటి సినిమాలను నిర్మించిన దాసరి కిరణ్... ఇప్పుడు వర్మతో కలిసి ‘వంగవీటి’ని పట్టాలెక్కిస్తున్నాడు. అలానే బుల్లితెర నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ తో ‘సిద్ధార్థ’ మూవీని కంప్లీట్ చేసేసి... ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. సుమారు 300 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గతంలో షారూఖ్ ఖాన్ కూడా బుల్లి తెర నుంచే వెండితెరకు పరిచయమై.. బాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అయ్యాడు. అలా సాగర్ కూడా బుల్లితెర నుంచి వెండితెరకు వస్తున్నాడు. అతని నటన చూస్తుంటే తప్పకుండా వెండితెరపైనా క్లిక్ అవుతాడు. ఇప్పటికే సీరియల్స్ తో మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో మరింత చేరువ అవుతాడు’ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ వాళ్లను అడిగాం. కానీ కొన్ని యాక్షన్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ వల్ల కుదరదని ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఇందులోని కంటెంట్ ఓ స్టార్ హీరో సినిమాకు ఉండాల్సింది వుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మలేషియాలో 28 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. తప్పకుండా సాగర్ ఓ మంచి హీరో అవుతాడని’ తెలిపాడు.

ప్రస్తుతం తాను నిర్మిస్తున్న వంగవీటి.. చిరు అభిమానిగా తన కోరిక ఏంటో వెల్లడిస్తూ... ‘తన ఆరాధ్య నటుడు చిరంజీవి అవకాశం ఇస్తే.. తన 151వ సినిమాగా చాలా కాలం నుంచి ఊరిస్తున్న ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ మూవీని ఎంత ఖర్చైనా తెరకెక్కిస్తా. పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసేశారు. కొన్ని మార్పులు... చేర్పులు చేసి.. దాన్ని పట్టాలెక్కించడానికి రెడీ. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. చూడాలి.. ఏం అవుతుందో. ప్రస్తుతం వర్మ ‘వంగవీటి’ సినిమా తీస్తున్నారు. దాని మీదే నా దృష్టి అంతా. ఇది ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా గానీ.. వ్యతిరేకంగా గానీ వుండదు. చాలా బ్యాలెన్స్ డ్ గా వుంటుంది. నాకు రెండు వర్గాలతోనూ మంచి సన్నిహిత సంబంధాలే వున్నాయి. కాబట్టి... ఈ సినిమా రిలీజ్ అయితే విజయవాడ మళ్లీ హాట్ గా మారుతందనే ప్రచారంలో నిజం లేదు’ అన్నారు. ఈ చిత్రంలో వర్మ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని ముగించారు.

No comments:

Post a Comment