Showing posts with label Janasena. Show all posts
Showing posts with label Janasena. Show all posts

16/09/2016

Pawan Kalyan is A JOKER - Asaduddin Owaisi

Ever since Pawan Kalyan spoke in Kakinada meeting, there has been huge buzz regarding Pawan's political career. However most of the Political parties considered him as a big fat joke. Already we reported that many political leaders mocking Pawan Kalyan.

Now AIMIM party President Asaduddin Owaisi addressed a Public meet recently and called Jana Sena President and actor Power Star Pawan Kalyan as a joker for his support to the Prime Minister Narendra Modi. Asaduddin Owaisi also said that Modi is solely responsible for death of 350 people during Godhra violence. He further lashed out TDP Chief Chandrababu Naidu saying that he was in alliance with BJP and still supporting them. He asked the crowd to utter the name of actor who met Modi ji in person and extended his unconditional support.

And soon after everyone said Pawan, he called him as JOKER in a satirical manner. Earlier Owaisi had slammed the Bollywood actor Salman Khan when he met Modi and urged his supporters to boycott Salman Khan’s movies.

కొమరం పులిలా రావయ్యా.. పవన్

ఆ ఇద్దరూ సినిమాల్లో మంచి పేరున్నవాళ్లే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ పాపులరే. ఇద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేకపోయినా ఒకే కాలంలో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా అందులో ఒకరిపై ఇంకొకరు ఘాటైన విమర్శలే చేయడంతో రాజకీయంగా అలజడి రేగుతోంది. అందులో ఒకరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత - హీరో వపన్ కళ్యాణ్ అయితే... రెండో వ్యక్తి - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - మాజీ హీరోయిన్ రోజా.  పవన్ తన హీరోయిజం చూపించాలే కానీ గోడ మీద పిల్లిలా ఉండకూడదని ఆమె అనడం సంచలనంగా మారింది.

ప్రజాసేవ చేయాలని - రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా పూటకో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని పవన్ కు రోజా  సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహారదీక్షలో పాల్గొన్న ఆమె ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన పవన్ - టీడీపీ - బీజేపీలకు మద్దతిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారని - ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగులు పెట్టి డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. చేతనైతే ఎన్టీఆర్ లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. 

మరోవైపు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె నాడు పవన్ కూడా హోదా వస్తుందని చెప్పారని ఇప్పుడిక రెండున్నరేళ్ల తరువాత ఇంకా వేచి చూసే ధోరణి ఏంటని ప్రశ్నించారు. కాగా పవన్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నా వైసీపీ నుంచి ఎవరూ ఆయనపై ఫైరవ్వలేదు. తాజాగా రోజా వ్యాఖ్యలతో పవన్ పై విమర్శల దాడి మరింత పెరిగినట్లయింది. కాగా... రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా పవన్ కుటుంబంతో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న పవన్ సోదరుడు చిరంజీవితో రోజా పలు సినిమాల్లో నటించారు. పవన్ మరో సోదరుడు నాగబాబు - రోజాలు కలిసి ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నా రాజకీయంగా పవన్ వైఖరిని మాత్రం రోజా తీవ్రంగా తప్పు పట్టారు. మరి రోజా విమర్శలను విమర్శలుగా కాకుండా సూచనలుగా తీసుకుని పవన్ మారుతాడా.. కొమరం పులిలా విజృంభించి రోజా కోరిక తీరుస్తాడా అన్నది చూడాలి.

13/09/2016

పవన్ పై లోకల్ లొల్లి మొదలైంది

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కాకినాడ సభలో బీజేపీ లక్ష్యంగా విమర్శలు  చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇపుడు కొత్త రూపంలో కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీ జాతీయనేతలు ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సిద్ధార్థానాథ్ సింగ్ స్పందించగా ఇపుడు స్థానిక నాయకులు పవన్ పై కౌంటర్లు మొదలుపెట్టేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే  శాసనసభలో చీఫ్ విప్ ఆకుల సత్యనారాయణ తాజాగా పవన్ కు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఒనగూడే ప్రయోజనాలపై పవన్ కల్యాణ్ తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సత్యనారాయణ చాలెంజ్ చేశారు. తన సవాలుకు స్పందించాలనుకుంటే పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈసందర్భంగా వివరించారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి 24 గంటలు కరెంటు సరఫరా చేసి విద్యుత్ సమస్యలు తొలగించామన్నారు. కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థల్లో ఐఐటి - ఐఐఎం - ఎయిమ్స్ - ఐఐఎస్ ఇఆర్ - ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీ కలిపి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను కేంద్రం తొలగించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం భరిస్తుందని చెప్పారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తుందన్నారు. రైల్వే జోన్ కూడా త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారన్నారు. నాడు మాట్లాడని కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేడు రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా అనేది సాంకేతికంగా ఇవ్వడం కుదరనందు వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపించడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ లో జాతీయ వాదాన్ని గుర్తించిన నరేంద్రమోడీ ఆయనను ప్రమాణ స్వీకారం సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాలుకు ఆహ్వానించినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా పవన్ ప్రత్యేక హోదా - ప్యాకేజీ గురించి మాట్లాడాలి అనుకుంటే స్పందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చాలెంజ్ చేశారు. 

జనం మనం - మళ్లీ పెన్ను పడుతున్న పవన్

ప్రత్యేక హోదాపై కాక రేపుతున్న జనసేన అధినేత - సినీ హీరో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలతో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సభలు సమావేశాలతో పాటు పుస్తకం కూడా రాయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ ఇతివృత్తంతో రానున్న ఈ పుస్తకంలో రాజకీయాలు ఎలా ఉండాలి... ప్రస్తుతం ఎలా ఉన్నాయి... తమ కార్యాచరణ ఏంటనేది రాసుకొస్తారని తెలుస్తోంది. ఈ పుస్తకానికి ‘జనం మనం" అన్న టైటిల్ ఖరారు చేసినట్లు వినికిడి.

కాగా పవన్ గతంలోనూ పుస్తకం రాశారు. ఇజం పేరుతో ఆయన రాసిన పుస్తకానికి ఒక మోస్తరు స్పందన వచ్చింది అప్పట్లో.  కొత్త పుస్తకం 'జనం-మనం"కు  మార్పు కోసం యుద్ధం అన్న సబ్ టైటిల్ ఉంటుందని సమాచారం.  ఇప్పటికే మొదలుపెట్టిన ఈ పుస్తకాన్ని మరో రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఈ పుస్తకం  ద్వారా జనసేన సిద్ధాంతాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇజంలో కంటే మరింత క్లారిటీగా పలు అంశాలను ఈ పుస్తకం ద్వారా పవన్ కల్యాణ్ వివరించే అవకాశాలున్నాయి. రాజకీయంగా పవన్ కు కూడా క్లారిటీ పెరగడం.. అనేక అనుభవాలు.. అన్నిటి నేపథ్యంలో ఈ పుస్తకంలో కొంత వాస్తవిక ధోరణి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సభ తరువాత మళ్లీ ఇప్పట్లో సభేమీ లేకపోవడంతో పవన్ పుస్తక రచనలో మునుగుతున్నట్లు సమాచారం.

12/09/2016

పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారుగా

మేము ఇస్తున్నది తిరుమల శ్రీవారి లడ్డు అని కానీ షుగర్ ఉన్నవాళ్ళ కు అది పాచిపోయిన లడ్డు లాగా అనిపిస్తుందని ,అనవసర విమర్శలు కేంద్రంపై చేయొద్దని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారు బిజెపి నేతలు , కేంద్ర మంత్రులు . ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ లు అవసరం లేదని హోదా ఇవ్వాల్సిందే అంటూ పవన్ కేంద్ర ప్రభుత్వం పై అలాగే వెంకయ్య నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే . దాంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసారు బిజెపి నేతలు . కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా పవన్ ని అదుపులో ఉండమని హెచ్చరించాడు . ఇక ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిజెపి నాయకులు అయితే పవన్ పై ఒంటి కాలు మీద లేస్తున్నారు , విమర్శలకు దిగుతున్నారు . పవన్ మాత్రం వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం లేదు ప్రస్తుతానికి . మరి ఎలా ? ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి . 

పవన్ ని చూసి వర్మ కుళ్లుకుంటున్నాడట

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిన్నటి నుంచి ఓ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. పవన్ మంచి సింగరా.. తను మంచి గాయకుడా అన్నదే దీని ఉద్దేశ్యం. తానే బాగా పాడతానని కావాలంటే సాక్ష్యం ఇదుగో అని.. వంగవీటిలో తను పాడిన పాటని పోస్ట్ చేసి.. కాకినాడ సభలో పవన్ పాటను పోల్చుకోమని జనాలకు చెప్పాడు. చివరకు దీనిపై ట్విట్టర్ సాక్షిగా ఓటింగ్ కూడా పెట్టేశాడు. 

ఈ ఓటింగ్ లో మొత్తం 13609మంది పాల్గొంటే.. 54శాతం పవన్ కి.. 46 శాతం వర్మకి ఓటేశారు. అయితే.. తాను కేవలం 8శాతం తేడాతో ఓడిపోయానని చెప్పిన వర్మ.. ఈ పోలింగ్ లో ఇంత తక్కువ మంది పాల్గొనడంతో.. పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. 'మా అమ్మ.. సోదరుడు.. అమ్మమ్మ.. ఆంటీ కూతురు.. చుట్టుపక్కలవాళ్లు అందరూ పవన్ కళ్యాణ్ సింగింగ్ కే ఓటేశారు. నాకు విపరీతమైన కుళ్లుగా ఉంది' అంటూ ట్వీట్ చేస్తూనే.. పవన్ కళ్యాణ్ అభిమానులను నిరక్షరాస్యులు అనేశాడు

'ఇంత తక్కువ మంది ఓటేశారంటే.. కచ్చితంగా ఫ్యాన్స్ నిరక్షరాస్యులే.. ఇలాంటి వాళ్లకంటే కాస్త చదువుకున్న తెలివైన ఫ్యాన్స్ ని పవన్ కాన్సంట్రేట్ చేస్తే బెటర్' అంటూ పవన్ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఒకవైపు ఓడిపోయానని ఒప్పుకుంటూనే.. అందుకు కారణం పవన్ ఫ్యాన్స్ పైనే తోసేశాడు వర్మ. 

11/09/2016

పవన్ గురించి వర్మ తాజా మాట విన్నారా?

ఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తుంటారు విలక్షణ దర్శకులు రాంగోపాల్ వర్మ. విషయం ఏదైనా తన మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అస్సలు ఆలోచించని తత్వం వర్మకు మాత్రమే సొంతం. ఎంత వివాదాస్పదమైన అంశాన్నైనా ఓపెన్ గా మాట్లాడే ఆయన కొన్నిసార్లు ఎంతగా పొగిడేస్తారో.. మరికొన్నిసార్లు అంతే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారు.

కాకినాడ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిన పాట కంటే వంగవీటి సినిమాలో తాను పాడిన పాటే బాగుందంటూ చురకలు అంటించేలా ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన వర్మ.. మరోవైపు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా వెనకేసుకురావటం గమనార్హం. పవన్ ను ఏ ఒక్కరూ తక్కువగా అంచనా వేయొద్దన్న ఆయన.. పవన్ ను చిన్నచూపు చూసినోళ్లంతా చెత్త ఆలోచన ఉన్నోళ్లేనంటూ ఆరోపించారు.

కాకినాడ సభలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడిపై పవన్ కల్యాణ్ భారీ ఎత్తున దాడికి దిగటం.. ఈ వ్యవహారాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకొని.. ముప్పేట విమర్శల దాడికి చేసేలా వ్యూహం సిద్ధం చేయటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పలువురు పవన్ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్న వేళ.. వర్మ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయి.. ఏపీ.. తెలంగాణలోని పరిస్థితుల్లో పవన్ కున్న అవగాహన.. ఆయనకున్న ఫ్యాన్స్ ను గమనిస్తే.. పవన్ కమాండర్లకే కమాండర్ అవుతారన్నారు. ఏపీలో అతి పెద్ద కమాండ్ గా అవుతారన్న వర్మ.. పవన్ గురించి డర్టీ మైండ్ ఉన్నోళ్లే తప్పుగా ఆలోచిస్తారని అమితమైన అభిమానాన్ని ప్రదర్శించటం గమనార్హం.

పవన్-మోడీ మధ్య చిచ్చు: ట్విస్ట్.. జనసేన దెబ్బకి వెంకయ్య రివర్స్!

ఏపీకి ప్రత్యేక హోదా అంశం జనసేన, బీజేపీల మధ్య చిచ్చు రాజేసింది. 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఏపీలో టిడిపి - బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిందనే వాదన ఉంది. దీనిని ఆ పార్టీలు కూడా అంగీకరించాయి.

ముఖ్యంగా, బిజెపిని చూసే ఆ కూటమికి పవన్ మద్దతు పలికారనే వాదన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అన్నా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నా గౌరవం అని పవన్ చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడీ తన ప్రమాణ స్వీకారానికి పవన్‌ను ఆహ్వానించారు. ఈయన హాజరయ్యారు.

ఓ ప్రశ్న వేస్తా, ప్రతిదీ హైదరాబాద్ కాదు: కేవీపీకి వెంకయ్య ప్రశంస, పవన్‌కు కౌంటర్

ప్రధాని మోడీకి, పవన్ కళ్యాణ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలు పలుమార్లు ప్రశ్నించాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్.. తనకు సన్నిహితంగా ఉండే మోడీ వద్దకు వెళ్లి అడగవచ్చు కదా అని ప్రశ్నించాయి. దానికి పవన్ కూడా సమాధానం చెప్పడం వేరే విషయం.

మొత్తానికి బీజేపీతో, ముఖ్యంగా ప్రధాని మోడీతో పవన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం వారి మధ్య చిచ్చు రాజేసింది.

నాడు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు దాని పైన మాట మార్చడం, పవన్ కళ్యాణ్ హోదా ఇవ్వాలని ఉద్యమించడం వీరిద్దరి మధ్య గ్యాప్‌కు కారణమైంది.

నిన్నటిదాకా మద్దతు పలికి..

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ప్రశ్నించడాన్ని ఏపీ బీజేపీ నేతలు కూడా తొలుత స్వాగతించారు. తిరుపతి సభలో హోదా పైన పవన్ ప్రశ్నించడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. అయితే, కాకినాడ సభ తర్వాత అంతా మారిపోయింది.

చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్

పవన్ ఒకింత ఘాటుగా బీజేపీని విమర్శించడం వారికి రుచించలేదని చెప్పవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. వెంకయ్య నాయుడిని విమర్శించేంత సీన్ పవన్‌కు లేదని దుమ్మెత్తి పోస్తున్నారు.

పవన్ కళ్యాణ్ దెబ్బకి వెంకయ్య రివర్స్!

పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీయడంతో బీజేపీ, వెంకయ్య నాయుడు లైన్లోకి వచ్చారని అంటున్నారు. నిన్నటి దాకా హోదా పైన పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, హోదాతో లాభం ఏమిటని నిలదీశారు. ఇప్పుడు వెంకయ్య మాటలో తేడా కనిపించిందని అంటున్నారు.

హోదాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆదివారం నాడు అన్నారు. అయితే, హోదాతో కొన్ని ప్రయోజనాలు నిజమే కానీ, ప్రతి ఊరి హైదరాబాద్ కాదని చెప్పారు. హోదాతో అద్భుతాలు జరగవని చెప్పారు. ఏపీకి కావాల్సింది హోదా కాదని, ప్రత్యేక శ్రద్ధ అన్నారు.

వెంకయ్యని పవన్ టార్గెట్ చేయడ వెనుక: లడ్డూలకూ కథ

అలాగే, ఏపీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తనను ప్రశ్నించడంలో అర్థం లేదని వెంకయ్య నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు అతిగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ వర్సెస్ వెంకయ్య

ఇప్పుడు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వెంకయ్యగా కనిపిస్తోందని అంటున్నారు. పవన్ హోదా పైన గట్టిగా నిలదీయడంతో.. వెంకయ్య అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని, అవి ఎవరికి కావాలని కాకినాడ సభలో పవన్ అన్నారు.

దీనిపై వెంకయ్య మాట్లాడుతూ... తాము రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని, దానిని ఎగతాళి చేస్తున్నారని, డబ్బు పాచిపోదని కౌంటర్ ఇచ్చారు. వేరే రకంగా డబ్బు పెడితే ప్రమాదమని, మేం ఇచ్చిన డబ్బు మాత్రం పాచిపోదన్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్రం ఇంత సాయం చేయలేదన్నారు.

పవన్ కళ్యాణ్ ని విమర్శించిన కేటిఆర్

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తొలినాళ్ళ లో 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పిన మాటలను తప్పుబట్టారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . ఏ గూటి పక్షలు ఆ గూటికే చేరుతాయన్న చందంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యిందని , పవన్ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలకు అభ్యంతరకరమని ఓ టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు కేటిఆర్ . అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలని ఏ నాయకుడు కూడా పోరాటం చేయడం లేదని , వాల్లెవరికి చిత్తశుద్ది కూడా లేదని ఇప్పటివరకు ఎపి కి ఏమైనా వచ్చాయంటే అది కేవలం మా వల్లే అంటూ పెద్ద బాంబు పేల్చాడు కేటిఆర్ . తెలంగాణ రాష్ట్రము ఏర్పడటం వల్ల పలు సంస్థలు ఎపికి వచ్చాయని అంటున్నాడు కేటిఆర్.

పవన్ పై సెటైర్ వేసిన మంత్రి

 బావ అల్లు అరవింద్ ని అనకాపల్లి లో ఎంపి గా గెలిపించుకోలేక పోయావ్ , నీ అన్న ,నువ్వు కలిసినా అల్లు అరవింద్ ని గెలిపించలేక పోయారు అటువంటిది అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే గెలిపిస్తావా ? అంటూ పవన్ కళ్యాణ్ ని దెప్పి పొడిచాడు అంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు . ఇష్టమొచ్చి నట్లు మాట్లాడొద్దని , పవన్ కళ్యాణ్ మాటలకు అర్ధమే లేదని ఆగ్రహం వ్యక్తం చేసాడు అయ్యన్న పాత్రుడు . నిన్న జరిగిన కాకినాడ సభలో పవన్ ఆవేశంగా మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ ని రాజీనామా చేయమని కోరిన విషయం తెలిసిందే . 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపి గా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే దాంతో అయ్యన్న పవన్ పై సెటైర్లు వేసాడు.

పవన్ కూడా ప్రజల్లో ఒక్కడే వెంకయ్య

రాజకీయాలు మహా కర్కసంగా ఉంటాయి. వాడి పారేయటం.. అవసరం తీరా కాడి పారేయటం ఎలా అన్నది రాజకీయాల్ని చూసి మాత్రమే తెలుసుకోవాలి. తాజాగా ఏపీ రాజకీయాల్ని చూడండి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కోరుకున్న బీజేపీ.. టీడీపీలు.. ఈ రోజు ఆయన వాదనకు విలువనిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తమలో ఒకడైన పవన్.. తమను ఎప్పుడైతే విమర్శించాడో.. వ్యతిరేకించాడో వెంకయ్య మొదలు అందరికి శత్రువయ్యారు. ఇంతకీ పవన్ చేసిన తప్పేంటి అంటే.. ప్రజల పక్షాన మాట్లాడటం. మోడీకి కొమ్ము కాయకపోవటం.

హోదా సాధ్యమా? సాధ్యం కాదా? అన్న విషయాన్ని గడిచిన కొన్నిరోజులుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ.. ఆ వాదనలోకే వెళ్లే ముందు.. అలా అన్న వారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న సంధిస్తే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తుందనే ఉద్యమం చేశారా? పక్కా అనే తెలంగాణ ఉద్యమ గోదాలోకి కేసీఆర్ దిగారా? అన్న ప్రశ్న వేసుకుంటే హోదా సాధ్యమేనా? అన్న ప్రశ్నకు సమాదానం దొరికిపోతుంది.

హోదా తమకు కుదరదని తేల్చుకున్న బీజేపీ అధినాయకత్వం.. ఎన్నికలు ముగిసి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల మూడు నెలలకు ఎందుకు తేల్చి చెప్పినట్లు? ఎవరైతే హామీ ఇచ్చారో వారిని తీవ్రస్థాయిలో విమర్శించిన పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. అలా చేసిన వారిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఉందన్న ఆయన.. తనపై కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

తాను ప్రజలకు జవాబుదారినని.. వారికే సమాదానం చెబుతానంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వారు అప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన వెంకయ్య రెండు విషయాల్ని మర్చిపోయారని చెప్పాలి. ప్రత్యేకహోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా.. అప్పట్లో తమతో భుజం కలిపారని.. తమకు మిత్రులుగా ఉన్నారన్నది మర్చిపోకూడదు. ఇక.. ప్రజలకే తాను సమాధానం చెబుతానని చెబుతున్న వెంకయ్య.. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రజల్లో ఒక్కడన్న విషయాన్ని ఆయన మర్చిపోవటం ఏమిటో..?

పవన్ కు ముద్రగడ బంపర్ ఆఫర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. జనసేనానికి ఈ రోజు ఇద్దరు ప్రముఖులు తమ మద్దతు ప్రకటించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ఆదివారం గుంటూరులో పేర్కొన్నారు.

ఇక కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం ఈ రోజు రాజమండ్రిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పవన్ కు సూపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని నడిపితే తామంతా ఆయన వెనకే ఉండి పోరాటం చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో కాపులంతా కలిసి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

  ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న విమర్శలు చేసిన ఆయన.. చంద్రబాబు కాపుల్లో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఆ పప్పులుడకవని హెచ్చరించారు. ఇక కాపులంతా రిజర్వేషన్ల కోసం సమైక్యంగా ఉద్యమిస్తున్నారని...తమ డిమాండ్లను తాము సాధించి తీరుతామని ఆయన చెప్పారు. చంద్రబాబు కేవలం కుర్చీ కోసమే కాపుల్లో ఐక్యత దెబ్బతీసే ప్లాన్లు వేయడంతో పాటు తనపై కాపు వ్యతిరేకి - టెర్రరిస్ట్ అన్న ముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

 ఇక బాబు ఓటుకు నోటు కేసుకు భయపడుతున్నారని..ఆయన హోదాను అమ్మేసి భూములను దోచుకున్నారని... హోదాను కేంద్రానికి - భూములను సింగపూర్ కు అమ్మేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే తుని లాంటి సమావేశం పెట్టాలని కూడా ముద్రగడ సవాల్ విసిరారు. మరి ముద్రగడ ఆఫర్ ను పవన్ స్వీకరిస్తారా ?  పవన్కు ముద్రగడ మద్దతు ఇస్తారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

10/09/2016

No More Public Meetings: Pawan Kalyan

Power star and Jana Sena party president Pawan Kalyan is known for his special appearances, surprising speeches and shocking decisions. Nobody can guess when he comes out in public, what he does and what he speaks.

It was only the other day that Pawan Kalyan announced that he would address a series of meetings, starting with Kakinada meeting, to highlight the demand for special category status to Andhra Pradesh and fight for the just cause of the people. As announced, he addressed a huge rally at Kakinada on Friday.

 

But on Saturday, Pawan sprang a surprise on his fans, party cadre and also people of the state that he would not address any more meetings in the state.

He said he had taken this decision following the death of his fan Venkata Ramana, who died of shock at his meeting at Kakinada.

While announcing a compensation of Rs 5 lakh to his family, Pawan said he did not want to cause pain to his fans by addressing public meetings.

“I don’t want to address any public meetings and cause inconvenience to the people. I will think of other forms of agitation,” Pawan said.

పవన్ నాలుక కోస్తారా!టీడీపీ ఎంపీకి శివాజీ ప్రశ్న

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు - నాయకుల మధ్య వార్ తీవ్రమవుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. హోదా కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సింది పోయి ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి మైలేజ్ కోసం వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు - సినీ నటుడు శివాజీ కొద్ది రోజులుగా హోదా కోసం తన స్వరం గట్టిగా వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శివాజీ కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి - టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై దారుణమైన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీల నుంచి శివాజీకి కౌంటర్లు వచ్చాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ సుజనా చౌదరిని ప్రశ్నించడానికి శివాజీ ఎవరు ?  మరోసారి శివాజీ సుజనా గురించి మాట్లాడితే శివాజీ నాలుక కోస్తానని ఫైర్ అయ్యారు.

 అయితే ఈ వ్యాఖ్యలపై శివాజీ శనివారం తనదైన స్టైల్లో మళ్లీ స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం విజయవాడలో నిర్వహిస్తోన్న బంద్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను గళమొత్తితే ఓ ఎంపీ తన నాలుక కోస్తానని అన్నారని..మరి పవన్ కళ్యాణ్ కూడా హోదా కోసం గళమెత్తితే ఆయన నాలుక కూడా కోస్తా అని ఎందుకు అనలేదని శివాజీ పరోక్షంగా ఎంపీ శివప్రసాద్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. 

 పవన్ ను ఏమైనా అంటే పవన్ అభిమానులు తిరగబడతారని భయపడుతున్నారా ? ఎంపీలు మనిషిని బట్టి ఒక్కో మాట మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన శక్తిని కరెక్టుగా వాడుకుంటే ఆయనకు కేవలం వారం రోజుల్లో ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని..కేవలం ఏపీకి న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని కుండబద్దలు కొట్టారు.

 చంద్రబాబు సర్కార్ పైనా శివాజీ సెటైర్లు వేశారు. అప్పుడప్పుడు కేంద్రం వేస్తోన్న భిక్షాన్ని తీసుకోవద్దని ఆయన ఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సైతం కేంద్రం ప్రజలను మాయ చేస్తోందని...పోలవరం ప్రాజెక్టు అంత సులువుగా పూర్తవ్వదని కూడా శివాజీ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు....పవన్ జనసేన పెట్టుకున్నారు...శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు గుప్పించమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని... ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని...ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆపే ప్రశక్తేలేదని శివాజీ తేల్చిచెప్పారు. ఏదేమైనా ప్రత్యేక హోదా కోసం శివాజీ ఉడుం పట్టినట్టే కనిపిస్తోంది.